టాలీవుడ్ ప్రేక్షకులందరినీ ఆకర్షిస్తూ టాప్ రేటింగ్  తో దూసుకుపోతుంది  బిగ్ బాస్ తెలుగు సీజన్ 3. అప్పుడెప్పుడో జులై 21న ఈ షో మొదలైంది. పదహారు మందితో మొదలైన బిగ్ బాస్  తెలుగు సీజన్ 3 ప్రస్తుతం ఆరుగురు కంటెస్టెంట్స్ తో రన్ అవుతుంది. ఈ షో  మొదలైన మొదటి వారం నుంచి నామినేషన్లు ఎలిమినేషన్ ప్రక్రియ మొదలైంది. బిగ్ బాస్ 3... 90 రోజులకు పైగా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. అయితే 13 వారాలు పూర్తి చేసుకుని 14 వారాలు లోకి అడుగుపెట్టింది ఈ షో. కాగా  బిగ్ బాస్ హౌస్ లో శివ జ్యోతి, బాబా భాస్కర్,  రాహుల్ సిప్లిగంజ్,  అలీ రజా, శ్రీముఖి, వరుణ్ సందేశ్ లు ఉన్నారు. కాగా వీళ్లలో బిగ్ బాస్ విన్నర్ శ్రీముఖి అవ్వబోతుందని  చాలా రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేసిన విషయం తెలుసు. 

 

 

 

అయితే  బిగ్ బాస్ హౌస్ లో ఉన్న శ్రీముఖి గురించి ప్రేక్షకుల్లో ఎంత ఫాస్ట్ వైబ్రేషన్స్ ఉన్నాయో అంత నెగిటివిటీ కూడా ఉంది. హౌస్ నుండి బయటకు వచ్చిన మహేష్ విట్టా, హిమజా లాంటి కంటెస్టెంట్స్ హౌస్ లో  బిగ్ బాస్  శ్రీముఖికి  హెల్ప్ చేస్తున్నారని ... ఎప్పుడు శ్రీముఖి ఫీవర్ గానే ఎపిసోడ్ కూడా చూపిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేయడంతో కాస్త నెగిటివిటీ కూడా ప్రేక్షకుల్లో శ్రీముఖిపై  ఏర్పడింది. దీంతో శ్రీముఖికి  బయట నుంచి కాస్త సపోర్టు కూడా తగ్గింది. అయితే ఈ వారం ఎలిమినేషన్ లో శివ జ్యోతి బాబా భాస్కర్ పేరు ఎక్కువగా వినిపిస్తుంది.

 

 

 

కాగా మహేష్ విట్ట హిమజ లా  కామెంట్స్ తో శ్రీముఖి కాస్త ప్రేక్షకులను నెగిటివిటీ ఏర్పడడంతో ఆమెకు ఓటింగ్ శాతం కూడా తగ్గిపోయింది. ఈ క్రమంలో  జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ శ్రీముఖి మద్దతుగా నిలిచింది. శ్రీముఖి గురించి తనకు బాగా తెలిసని ... శ్రీముఖి ఎలాంటి వ్యక్త్తో  కూడా తనకుబాగా  తెలుసని తెలిపింది రష్మి. శ్రీముఖి నేను బిగ్ బాస్ విన్నర్ గా చూడాలనుకుంటున్నాను  అంటూ సోషల్ మీడియాలో తెలిపింది రష్మీ . అయితే రష్మీ సపోర్ట్ చేయడం తో రష్మీ  అభిమానులు  కూడా శ్రీముఖి మద్దతుగా నిలిచే అవకాశం ఉంది. అంతేకాకుండా జబర్దస్త్ ప్రేక్షకులు  కూడా శ్రీముఖి సపోర్ట్ చేసే అవకాశం ఉంది. దీంతో శ్రీముఖి ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: