టాలీవుడ్ టాప్ హీరోలలో కమర్షియల్ యాడ్స్ ద్వారా ఎక్కువ సంపాదన చేసే సెలిబ్రిటీలు ఎవరు అంటే ఒక్క మహేష్ బాబు పేరు తప్ప  మరి ఎవ్వరి పేరు వినిపించదు. వాస్తవానికి మహేష్ సినిమా సంపాదన కంటే అతడికి యాడ్స్ వల్ల వచ్చే సంపాదన ఎక్కువ అన్నది ఓపెన్ సీక్రెట్.   

ప్రస్తుతం మహేష్   బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న కొన్ని కంపెనీలలో మహేష్ కు భాగస్వామయం ఉన్నట్లుగా కూడ వార్తలు వస్తున్నాయి. గత కొన్నాళ్లుగా మహేష్ బాబు ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ సాయి సూర్య డెవలపర్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న విషయం  తెలిసిందే. అమరావతి ప్రాంతంలో ఉన్న ఈ కంపెనీలో మహేష్ కు వాటాలు ఉన్నాయి అని అంటారు. 

ఇక లేటెస్ట్ గా మహేష్ ఫ్యామిలీ మొత్తం నటించిన సాయి సూర్య డెవలపర్స్ వారి యాడ్ బయటకు  వచ్చింది. మహేష్ బాబు నమ్రతలతో పాటు వారిద్దరి పిల్లలు గౌతమ్ సితారలు కూడ ఈయాడ్ లో కనిపించడంతో  ఈ యాడ్ కు విపరీతమైన స్పందన వస్తోంది. ఈ యాడ్ లో గౌతమ్ చాల హుందాగా కనిపిస్తూ పొడవులో మహేష్ ను మించిపోయే విధంగా కనిపిస్తున్నాడు. అదే విధంగా  సితార కూడ చాల క్యూట్ గా ఈయాడ్ లో  కనిపిస్తూ ఉండటంతో మహేష్  అభిమానులు ఈయాడ్ కు బాగా కనెక్ట్ అవుతున్నారు.  

చాల కాలం తర్వాత నమ్రత ఒక కమర్షియల్ యాడ్ లో మేకప్ తో కనిపించడంతో ఈ యాడ్ మహేష్ అభిమానుల మధ్య వైరల్ గా మారింది.  వాస్తవానికి  ఈ యాడ్ సాయి సూర్య డెవలపర్స్ కు బిజినెస్ పరంగా ఎంత హెల్ప్ అవుతుందో తెలియకపోయినా మహేష్ అభిమానులకు మాత్రం బాగా నచ్చింది. ఈ యాడ్ ఇలా వైరల్ అవడంతో కొందరు ఈయాడ్ లో సూపర్ స్టార్ కృష్ణను కూడ  కలుపుకుని ఉంటే ఫ్యామిలీ ప్యాకేజ్ పూర్తి అయ్యేది కదా అంటూ జోక్ చేస్తున్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: