టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమా 'అల వైకుంఠపురములో' కు సంబంధించి ఇప్పటివరకు రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్, సామజవరగమనా పల్లవితో సాగె ఒక లిరికల్ సాంగ్ యూట్యూబ్ లో బాగా సక్సెస్ సాధించడంతో పాటు ప్రేక్షకుల నుండి మంచి స్పందనను రాబట్టడం జరిగింది. బన్నీ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను హారిక హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంస్థలు అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా పీఎస్ వినోద్ ఫోటోగ్రఫీని, ఎస్ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. 

ఇకపోతే ఈ సినిమా నుండి రాములో రాముల అనే పల్లవితో సాగె ఒక సాంగ్ వీడియో ప్రోమోని మూడు రోజల క్రితం యూట్యూబ్ లో రిలీజ్ చేసింది సినిమా యూనిట్. మంచి పార్టీ మూడ్ లో క్లాస్ టచ్ తో సాగిన ఈ సాంగ్ ప్రోమోకు ప్రస్తుతం వీక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రస్తుతం ఈ సాంగ్ ప్రోమో 5 మిలియన్లకు పైగా వ్యూస్ దక్కించుకుని దూసుకుపోతోంది. అనురాగ్ కులకర్ణి మరియు మంగ్లీ కలసి ఆలపించిన ఈ సాంగ్ ని కాసర్ల శ్యామ్ రచించడం జరిగింది. 

ఇక ఈ సాంగ్ ఫుల్ లిరికల్ వీడియోని దీపావళి రోజున రిలీజ్ చేయనున్నారు. అయితే మొదట రిలీజ్ చేసిన 'సామజవరగమనా' సాంగ్ ఇప్పటికే అత్యధిక లైక్స్ సాధించిన తెలుగు సాంగ్ గా రికార్డు క్రియేట్ చేయడంతో పాటు,  నేటితో ఏకంగా యూట్యూబ్ లో 50 మిలియన్ల వ్యూస్ తో సరికొత్త రికార్డు సాధించి అదరగొడుతూ దూసుకుపోతోంది. దీనితో అల వైకుంఠపురములో సినిమాపై బన్నీ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో సైతం విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. అయితే అందుతున్న సమాచారం ప్రకారం బన్నీ ఈ సినిమాలో ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా నటిస్తున్నట్లు సమాచారం. అలానే హీరోయిన్ పూజ హెగ్డే కంపెనీ సీఈఓ గా నటిస్తున్నట్లు చెప్తున్నారు. అక్కినేని సుశాంత్, నివేత పేతురాజ్, టబు, మురళి శర్మ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నారు....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: