కోలీవుడ్ లోదర్శకత్వం,నిర్మాత,రచయిత,సింగర్ తన సత్తా చాటుతున్న హీరో ధనుష్ నటించిన ‘అసురన్’ సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని బాక్సాఫీస్ షేక్ చేస్తుంది. తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ అల్లుడుగి వెండి తెరకు పరిచయం అయిన ధనుష్ విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు.   మాస్ ఫాలోయింగ్‌ను పెంచుకుంటూ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుంటున్నాడు. రఘువరణ్ బీటెక్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసులను దోచుకున్నాడు.

తాజాగా ‘అసురన్’ అంటూ వచ్చి బాక్సాఫీస్‌పై యుద్దం చేస్తున్నాడు. ఈ సినిమాకి జాతీయ అవార్డు గ్రహీత వెట్రి మారన్ దర్శకత్వం వహించారు.  మంజు వారియర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. . కథా కథనాలపరంగా .. ధనుశ్ నటన పరంగా ఈ సినిమా ప్రేక్షకులచే ప్రశంసలు అందుకుంటోంది.  కోలీవుడ్ సినీ ప్రముఖులే కాదు .. టాలీవుడ్ సినీ ప్రముఖులు సైతం ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ధనుష్ తాజాగా నటించిన 'మారి2'.. సినిమా సీక్వెల్ మాత్రం ఆశించిన స్థాయిలో హిట్ టాక్ తెచ్చుకోలేదు.

ఈ నేపథ్యంలో మంచి కథ కావడంతో ఈ సినిమాకి ఓకే చెప్పారు. ఈ నేపథ్యంలో వెట్రి మారన్ దర్శకత్వంలో ‘అసురన్’ మూవీలో నటించారు.  కాగా, ధనుశ్ కెరియర్లో అత్యధిక వసూళ్లను సాధించిన మూవీగా నిలిచింది. ధనుశ్ కెరియర్లోనే ఈ సినిమా ప్రత్యేకం అని అభిమానులు కితాబునిస్తున్నారు. దీపావళికి విజయ్ .. కార్తీ సినిమాలు విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఆ రెండు సినిమాల పోటీని 'అసురన్' ఎంతవరకూ తట్టుకుని నిలబడుతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: