బాలకృష్ణ - కె.ఎస్. రవికుమార్ల కాంబోలో వచ్చిన జై
సింహ మంచి కమర్షియల్ సక్సస్ ను అందుకుంది. ఆ తర్వాత వచ్చిన ఎన్.టి.ఆర్ బయోపిక్ గా తెరకెక్కిన ఎన్.టి.ఆర్ మహానాయకుడు, ఎన్.టి.ఆర్ కథానాయకుడు సినిమాలు ఘోరపరాజయాన్ని మూటగట్టుకున్నాయి. అందుకే మళ్ళీ మంచి హిట్ కొట్టాలనే ఉద్దేశ్యంతో మళ్ళీ
బాలకృష్ణ - కె.ఎస్. రవికుమార్ తో జత కట్టాడు. ప్రస్తుతం ఈ ఇద్దరి కాంబోలో తెరకెక్కుతున్న
సినిమా షూటింగ్ శరవేగంగా జరగడమే కాదు.. అప్పుడే శాటిలైట్
బిజినెస్ కూడా జరిగిపోయింది. అయితే
బాలకృష్ణ సంక్రాంతి సెంటిమెంట్ని వదిలేసి.. డిసెంబర్లోనే కొత్త సినిమాతో రాబోతున్నాడని,
సినిమా గురించి వార్తలు రావడమే కానీ...
సినిమా టైటిల్ మాత్రం అఫీషియల్గా బయటికి రాలేదు.
కానీ శాటిలైట్ హక్కులు కొన్న ప్రముఖ ఛానల్ జెమిని వాళ్ళు మాత్రం బాలయ్య కొత్త
సినిమా టైటిల్ 'రూలర్' అంటూ ప్రకటించారు. టైటిల్ని జెమిని వాళ్ళు ప్రకటించి చాలా రోజులవుతున్నప్పటికీ.. చిత్ర బృందం నుంచి మాత్రం ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు. అయితే బాలయ్య ఫ్యాన్స్ మాత్రం ఈ విషయంలో బాగా డిసప్పాయింట్మెంట్ తో ఉన్నారట. ఎందుకంటే బాలయ్య సినిమాతో పాటు ఉన్న అన్ని సినిమాలకి సంబంధించిన అప్డేట్స్ వస్తున్నాయి కాబట్టి. అందుకే కనీసం టైటిల్తో ఓ అఫీషియల్ పోస్టర్ వస్తే బావుంటుందని ఫ్యాన్స్ అనుకున్నారు. మరి ఈ దీపావళికి ఏమైనా
బాలకృష్ణ కొత్త
సినిమా పోస్టర్తో పాటు టైటిల్ ని అనౌన్స్ చేస్తారేమో చూడాలి. ఇంతకుముందు బాలయ్య న్యూ లుక్ బయటికి లీకయ్యాక.. హడావిడిగా చిత్ర బృందం బాలయ్య కొత్త
సినిమా లుక్ ని విడుదల చేసింది.
కానీ ఇప్పుడు టైటిల్ విషయంలో అలా లేదు. ఇకపోతే బాలకృష్ణ..
రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో రెండు డిఫరెంట్ లుక్స్లో కనబడడమే కాకుండా సిట్యుయేషనల్ కామెడీతో అలరిస్తాడని చెప్పుకుంటున్నారు. ఈ సినిమాలో కావాల్సినంత యాక్షన్ సీన్స్ తో పాటు కామెడీ కూడా అదిరిపోతుందని అంటున్నారు. ఇక ఈ
సినిమా తర్వాత బాలయ్య మరో సారి
పూరి కలిసి పనిచేయబోతున్నారన్న వార్త ఈ మధ్య బాగా వైరల్ అవుతోంది. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన పైసా వసూల్ పరవాలేదనిపించుకుంది. అయితే
పూరి స్టైల్ కి మాత్రం బాలయ్య ఫిదా అయిపోయాడు. అందుకే మళ్ళీ
పూరి తో కలిసి వర్క్ చేయడానికి బాలయ్య ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక ఈ ఇద్దరి మధ్య చర్చలు కూడా జరిగాయని సమాచారం.
పూరి బాలయ్య కోసం అద్భుతమైన కథ ను రెడి చేస్తున్నారని కూడా తెలుస్తోంది.