బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 ముగింపు దశకు చేరుకుంది. వచ్చే వారంలో ఈ సీజన్ కు శుభం కార్డు పడనుంది. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ షో ప్రసార సమయాల్లో మార్పులు చేసింది స్టార్ మా యాజమాన్యం. మాములుగా ఈషో సోమవారం నుండి శుక్రవారం వరకు రాత్రి 9 :30 కి ప్రసారం అవుతుండగా శని , ఆది వారాల్లో రాత్రి 9గంటలకు ప్రసారం అవుతూ వస్తుంది. అయితే వచ్చే వారం నుండి ఈ షో సోమవారం నుండి శుక్రవారం వరకు రాత్రి 10గంటలకు ప్రసారం కానుండగా శని ,ఆది వారాల్లో మాత్రం రాత్రి 9గంటలకే ప్రసారం కానుంది. కొన్ని సీరియల్స్ షెడ్యూల్ స్లాట్ లలో మార్పులు జరుగడమే బిగ్ బాస్ టైమింగ్స్ ఛేంజ్ అవ్వడానికి కారణం అని తెలుస్తుంది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో 6గురు కంటెస్టెంట్లు మాత్రమే మిగిలారు. అందులో భాగంగా రాహుల్ , శ్రీ ముఖి ,బాబా భాస్కర్ , శివజ్యోతి ,అలీ రెజా , వరుణ్ సందేశ్ టైటిల్ వేటలో బరిలో ఉండగా వీరిలో ఇప్పటికే రాహుల్ ఫైనల్ కు అర్హత సాధించాడు. కాగా మిగితా 5గురు కంటెస్టెంట్లు ఈ వారం నామినేషన్ లోకి రావడం తో ఈ వారం ఎలిమినేషన్ పై ఉత్కంఠ నెలకొంది. ఇక పునర్నవి హౌస్ లో ఉన్నంత వరకు టాస్క్ లను సీరియస్ గా తీసుకోని రాహుల్ ఆమె వెళ్ళాక మాత్రం టాస్క్ ల పై శ్రద్ద పెట్టాడు. దాంతో ప్రేక్షకులనుండి కూడా అతనికి పెద్ద ఎత్తున మద్దతు లబిస్తుంది. ఈ వారం జరిగిన టాస్క్ లో కూడా గెలిచి రాహుల్ మిగిలిన కంటెస్టెంట్ల కంటే ముందే ఫైనల్ బెర్తు ఖరారు చేసుకున్నాడు. దాంతో రాహుల్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. బిగ్ బాస్ సీజన్ 3 టైటిల్ కూడా రాహులే గెలుచుకుంటాడని అతని అభిమానులు బలంగా నమ్ముతున్నారు. మరి ఈ సీజన్ టైటిల్ విన్నర్ ఎవరుతారో చూడాలి.