టివీ షోలలో అత్యంత పాపులర్ అయిన రియాలిటీ షో బిగ్ బాస్  ఇప్పుడు సీజన్ 3తో ముందుకు సాగుతుంది. దీనికి హీరో నాగార్జున వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. 15 మంది పార్టిసిపెంట్స్‌తో, జులై 21న ప్రారంభమైన ఈ షో సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతుంది. ప్రస్తుతం 14 వారం ముగించుకుంటూ షో ఫైనల్‌కి చేరుకుంది. ఇక బిగ్ బాస్ ఎవరిని విన్నర్‌గా ప్రకటిస్తారనేది ఆడియన్స్‌లో ఉత్కంఠను రేపుతుంది. ఈ సందర్భంలోనే ఫైనల్ కంటెస్టెంట్లలో ఒకరిగా ఉన్న యాంకర్ శ్రీముఖి గురించి మరో యాంకర్ రష్మీ  కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అవి ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.


బిగ్ బాస్ సీజన్ 3 నుంచి ప్రతీ వారం ఒక్కొక్కరుగా ఎలిమినేట్ అవుతూ వస్తున్నారు. ప్రస్తుతం హౌస్‌లో ఆరుగురు సభ్యులు మాత్రమే మిగిలారు. వారిలో అలీ, రాహుల్, శ్రీముఖి, బాబా భాస్కర్, వరుణ్ సందేశ్, శివజ్యోతి బిగ్ బాస్ ఇంట్లో ఉన్నారు. దీంతో ఈ ఆరుగురిలో బిగ్ బాస్ సీజన్ టైటిల్ ఎవరు గెలుచుకుంటారనేది హట్ టాఫిక్ గా మారింది.  ఇక ఎవరికి ఎవరి సపోర్ట్ లభిస్తుందని ప్రేక్షకులలో చర్చ నడుస్తుంది.

ఈ నేపథ్యంలో సడెన్‌గా ఎంటరైన రష్మీ వీడియోపై అందరు మాట్లాడుకుంటున్నారు. అలీకి సీరియల్ యాక్టర్స్ మద్దతు ఇస్తుండగా.. శివజ్యోతికి హిమజ, వరుణ్ కి పునర్నవి, వితికాలు సపోర్ట్ ఇస్తున్నారు. దీంతో శ్రీముఖీకి తాను ఫుల్ సపోర్ట్ ఇస్తున్నానంటు యాంకర్ రష్మీ గౌతమ్ ఓ వీడియోతో తెలిపింది. లవ్ యూ శ్రీముఖీ అంటూ.. శ్రీముఖీ ఎలాంటిదో తనకు తెలుసని, తను ఖచ్చితంగా టైటిల్ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేసింది.


కాగా సోషల్ మీడియాలో మాత్రం శ్రీముఖీపై ట్రోలింగ్స్ మాత్రం షో మెదటి నుండి ఉన్నాయి. అక్కడి విషయాలు ఇక్కడ.. ఇక్కడవి అక్కడ మోస్తుందనే టాక్ ఉంది. అయినా సరే శ్రీముఖి చివరి దాకా నిలవడం విశేషం. చూద్దాం మరి 100 రోజులు సాగే బిగ్ బాస్ సీజన్ 3 టైటిల్ ఎవరు కైవసం చేసుకుంటారో.


మరింత సమాచారం తెలుసుకోండి: