యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా అత్యంత భారీ బడ్జెట్ తో హై స్టాండర్డ్స్ టెక్నాలజీతో తెరెకెక్కిన్న 'సాహో' చిత్రం బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించడంలో ఫెయిల్ అయింది. దాంతో ప్రభాస్ తన తరువాత సినిమా జాన్ పై దృష్టి పెట్టాడు. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన విషయం తెలిసింది. జిల్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కిస్తోన్న ఈ పీరియాడిక్ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో ప్రభాస్ కొన్ని సీన్స్ లో కొత్త గెటప్ లో కనిపిస్తారట. రివేంజ్ స్టోరీతో సాగే ఓ థ్రిల్లింగ్ ప్రేమకథే ఈ సినిమా అని సినీ వర్గాలు చెబుతున్నాయి. పైగా 1960 కాలంలో ఈ కథ సాగుతుందట, అయితే ప్రభాస్ వింటేజ్ కార్లను కొనుగోలు చేసే ధనికుడిగా ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. సినిమాలో వింటేజ్ కార్లకు ప్రభాస్ కు చాలా దగ్గర సంబంధాలు ఉంటాయట. ముఖ్యంగా కార్లను అమితంగా ఇష్టపడే ప్రభాస్ ఒక పేదింటి అమ్మాయి ప్రేమలో పడతాడని.. అలాగే ప్రేమ కోసం ఏమి లేని వాడిగా ఆమె ముందే తిరుగుతాడని వార్తలు వస్తున్నాయి. ప్రభాస్ హీరోగా ఫుల్ ఎంటర్టైనర్ గా జాన్ ను తెర పై ఆవిష్కరిస్తున్నారు అని ఫిల్మ్ సర్కిల్స్ లో కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో చూడాలి.
కాగా మూడు భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్నీ గోపికృష్ణ మూవీస్ , యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 2020 చివర్లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తుంది. అయితే అత్యంత భారీ బడ్జెట్ తో హై స్టాండర్డ్స్ టెక్నాలజీతో తెరెకెక్కిన్న 'సాహో' చిత్రం నెగిటివ్ టాక్ తో బలమైన ఓపెనింగ్స్ ను కంటిన్యూ చేయకపోవడంతో ప్రభాస్ ఫీల్ అయ్యాడని... ముఖ్యంగా సాహో ఫెయిల్ అవ్వడానికి ముఖ్య కారణం సినిమా బాగా సీరియస్ గా సాగడమే అని.. అందుకే జాన్ లో బాగా ఎంటర్టైన్ మెంట్ ఉండేలా చూసుకుంటున్నాడట ప్రభాస్ . అందుకే స్క్రిప్ట్ ను మళ్లీ ఒక్కసారి మొత్తం సరి చూసుకోమని ఇప్పటికే దర్శకుడికి చెప్పినట్లు తెలుస్తోంది. పరుచూరి బ్రదర్స్ కూడా స్క్రిప్ట్ లో లోపాలు ఏమైనా ఉన్నాయా అని చెక్ చేస్తున్నారట. పరుచూరి బ్రదర్స్ ను ప్రభాసే ప్రత్యేకంగా స్క్రిప్ట్ ను చూడమని చెప్పారట. అలాగే కామెడీ బాగా రాస్తాడు అని పేరు ఉన్న గోపిమోహన్ కూడా ఈ సినిమా కోసం పని చేస్తోన్నట్లు తెలుస్తోంది.