ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న రష్మిక.. మరికొద్ది రోజుల్లో అక్కినేని నాగచైతన్య సరసన నటించనుంది.
రష్మిక మందన్నా ‘గీతాగోవిందం’ సినిమాతో టాలీవుడ్లో టాప్ హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది. ఈ
సినిమా సూపర్హిట్ అవ్వడంతో రష్మికకు అవకాశాలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే రష్మిక.. ‘దేవదాస్’, ‘డియర్ కామ్రేడ్’ వంటి చిత్రాల్లో నటించింది. కానీ ఆమె నటించిన ‘దేవదాస్’, ‘డియక్ కామ్రేడ్’ చిత్రాలు అంతగా ప్రేక్షకులకు ఎక్కలేదు.
ఇప్పుడీ
భామ చేతిలో
మహేష్ బాబు హీరోగా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’
సినిమా ఉంది. తాజా పరిస్థితులు చూస్తుంటే..తెలుగులో
రష్మిక హవా మాములుగా లేదు. ఇప్పటికే తన పారితోషకాన్ని భారీగా పెంచేసిన ఈ
బ్యూటీ తాను హీరోయిన్ గా చేయాలంటే కనీసం రూ. 3 కోట్ల నుంచి రూ. 4 కోట్ల మేర డిమాండ్ చేస్తోంది.
రష్మిక డిమాండ్ పెద్దదే అయినప్పటికీ, ఆమె కోసం అంత మొత్తం ఇచ్చేందుకు రెడీ అవుతున్నారట ఫిలిం మేకర్స్.
అయితే ఈ సినిమాకు గాను
రష్మిక రూ. 5 కోట్లు డిమాండ్ చేస్తోందనే టాక్ ఫిల్మ్ సర్కిల్స్లో వినిపిస్తోంది. నాగచైతన్య సరసన నటించబోతున్న
కన్నడ ముద్దుగుమ్మ చైతు రెమ్మ్యూనరేషన్ కంటే ఎక్కువే తీసుకుంటున్నట్టు. ఈ చిత్రంలో రష్మికను హీరోయిన్గా ఖరారు చేయాలని దిల్ రాజు మొదట భావించాడు. కానీ ఆమె భారీ మొత్తంలో డిమాండ్ చేయడంతో ఒకింత ఆశ్యర్యానికి గురైన దిల్రాజు.. అంతమొత్తంలో ఇవ్వడం కుదరదంటూ తేల్చి చెప్పారట.
దీంతో
రష్మిక ఈ ఆఫర్ను వదులుకున్నారని టాక్. ఈ క్రమంలో కొత్త దర్శకుడు శశి తీయబోయే చిత్రంలోనూ రష్మికకు నో చెప్పి, మరో హీరోయిన్ను పెట్టుకోవాలని ఆయన నిర్ణయించారని మరో టాక్ నడిచింది. ఈ నేపథ్యంలో
మహేష్ బాబు సరసన నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాపైనే ఉంది. ఈ
సినిమా హిట్టైతే..తప్ప
రష్మిక కి ఇండస్ట్రీలో క్రేజ్ పెరగడం కష్టమేనని సినీ జనాలు అంటున్నారు.