టాలీవుడ్ సినిమా పరిశ్రమకు ఇష్టం అనే సినిమాతో హేరియన్ గా ఎంట్రీ ఇచ్చిన శ్రియ, తొలి సినిమాతో పెద్దగా సక్సెస్ సాదించనప్పటికీ, తన ఆకట్టుకునే అందచందాలతో తెలుగు ప్రేక్షకుల మనసు మాత్రం దోచింది. ఇకపోతే ఆ తరువాత నాగార్జున హీరోగా దశరధ్ దర్శకత్వం వహించిన సంతోషం సినిమాతో తొలి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న శ్రియ, ఆ తరువాత మెల్లగా ఒక్కొక్కటిగా అవకాశాలు దక్కించుకుంటూ, టాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన నటించి మంచి పేరు సంపాదించింది. ఇక గత ఏడాది మార్చిలో తన రష్యన్ బాయ్ ఫ్రెండ్ ఆండ్రీ కోస్చీవ్ ను ఎంతో ఘనంగా వివాహమాడి శ్రీమతిగా మారిపోయింది. ఇక అక్కడినుండి సినిమాలను కొంతవరకు తగ్గించిన ఈ భామ

ఎక్కువగా తన భర్త మరియు ఫ్యామిలీతో కలిసి జీవితాన్ని గడుపుతోంది. అయితే మధ్యలో తనకు నచ్చిన అవకాశాలను మాత్రమే ఒప్పుకుంటూ అక్కడక్కడా సినిమాల్లో నటిస్తోంది. ఇక అసలు మ్యాటర్ లోకి వెళితే, రెండు రోజుల క్రితం ముంబైలో నిర్మాత రమేష్ తౌరాని దీపావళి పార్టీ ఇచ్చారు. ఈ పార్టీకి శ్రియ, తన భర్త ఆండ్రీతో కలిసి హాజరైంది. శ్రియ ట్రెడిషనల్ వేర్ అయిన లెహంగా లో అలానే ఆండ్రీ ఫార్మల్ స్టైల్ డ్రెస్ వేసుకుని ఈ పార్టీకి హాజరయ్యారు. 

అయితే పార్టీకి హాజరయ్యే సమయంలో ఇద్దరూ ఒకరిపై మరొకరు ప్రేమ ఒలకబోసుకుంటూ, అక్కడి లిఫ్టు వద్ద ముద్దాడుకుంటూ ఉండడంతో అక్కడి మీడియా ఫోటోగ్రాఫర్లు వెంటనే ఆ దృశ్యాలను క్షణం ఆలస్యం చేయకుండా తమ కెమెరాల్లో క్లిక్కుమనిపించారు. దానితో ఒక్కసారిగా ఆ ఫోటోలు వెంటనే సోషల్ మీడియా మాధ్యమాల్లో బయటకు రావడం, ఆ వెంటనే పలు మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవడం జరిగిపోయాయి. అయితే దీనిపై సోషల్ మీడియాలో కొంత చర్చ జరుగుతున్నప్పటికీ, మెజారిటీ నెటిజన్లు శ్రియ దంపతులను సమర్ధిస్తూ, వారిద్దరికీ పెళ్లయింది, తన భర్తను తాను ముద్దాడితే తప్పేముంది అంటూ తమ అకౌంట్స్ ద్వారా మెసేజెస్ చేస్తున్నారు.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: