‘ఆర్ ఆర్ ఆర్’ ప్రాజెక్ట్ లో జూనియర్ చరణ్ చిక్కుకోవడంతో మహేష్ ప్రతిసంవత్సరం తన వైపు నుండి రెండు సినిమాలు ఉండేలా చూసుకునే టాప్ హీరోల రేసులో తన ఆదిపత్యాన్ని కొనసాగించాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రస్తుతం మహేష్ నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ షూటింగ్ వచ్చే నెలాఖరుతో పూర్తి అయిపోతున్న పరిస్థితులలో ఈమూవీ విడుదల కాకుండానే మరో సినిమాను లైన్ లో పెట్టాలని మహేష్ చేస్తున్న ప్రయత్నాలు ఏమి కలిసిరావడం లేదు అని టాక్. 

గత కొంతకాలంగా మహేష్ తన లేటెస్ట్ మూవీ చివరికి వచ్చే సమయానికే తన తదుపరి ప్రాజెక్ట్ లైన్ లో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అయితే ఇప్పుడు పరిస్థితి అలా లేదు. వాస్తవానికి మహేష్ తో సందీప్ రెడ్డి సినిమా చేయాలని ప్రయత్నించి అతడితో ఎదురు చూడలేక ఇప్పుడు మళ్ళీ సందీప్ రెడ్డి బాలీవుడ్ ప్రాజెక్ట్ వైపే మరొకసారి వెళ్ళిపోతున్నట్లు తెలుస్తోంది. 

దర్శకుడు పరుశు రామ్ మహేష్ ను మెప్పించాలని అనేక ప్రయత్నాలు చేసి ఇప్పుడు లేటెస్ట్ గా ప్రభాస్ వైపు వెళ్ళిపోయాడు. అదేవిధంగా కన్నడ సంచలన దర్శకుడు ప్రశాంత్ నీల్ మహేష్ తో సినిమా చేసే విషయమై ఆ శక్తి  కనపరుస్తున్నా సరైన కథ దొరకడం లేదు అని అంటున్నారు. ఇక మహేష్ సినిమా చేయాలి అని కలలు కంటున్న రాజమౌళి మరో ఏడాదిన్నర దాక ఖాళీ అయ్యే ఆస్కారమే లేదు. 

మహేష్ కు వరస హిట్స్ ఇచ్చిన కొరటాల శివ చిరంజీవితో బిజీగా ఉన్నాడు. అయితే ఈసంవత్సరాంతానికి త్రివిక్రమ్ ఖాళీ అవుతున్నా ఎందుకో త్రివిక్రమ్ మహేష్ పట్ల ఆసక్తి కనపరచడం లేదు అని అంటున్నారు. ఈమధ్యనే మళ్ళీ ట్రాక్ లోకి వచ్చిన పూరీ ప్రస్తుతం విజయ్ దేవరకొండతో మూవీ చేస్తూ ఆపై సల్మాన్ ఖాన్ వైపు వెళ్ళిపోతున్నాడు. ఇలాంటి పరిస్థితులలో ప్రస్తుతం మహేష్ తో సినిమా తీస్తున్న అనీల్ రావిపూడి తాను మహేష్ తో మరొక సినిమాను వెంటనే మొదలు పెడతాను అంటూ సంకేతాలు ఇస్తున్నా ఆకథ వైపు ఆసక్తి కనపరచలేక యంగ్ డైరెక్టర్స్ ను నమ్మలేక పెద్ద దర్శకులు దొరకక మహేష్ కు ‘సరిలేరు నీకెవ్వరు’ విడుదల తరువాత కనీసం నాలుగు నెలలు గ్యాప్ వచ్చినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: