ప్రస్తుతం తెలుగు టెలివిజన్ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న రియాల్టీ షో బిగ్ బాస్ 3. 17 మంది సభ్యులు ఇంటి లోకి ఎంటర్ కాగా తాజాగా ఇంటిలో ఆరుగురు మాత్రమే మిగిలి ఉన్నారు. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ ఇస్తున్న టాస్క్ లు చూస్తున్న ప్రేక్షకులకు మరియు ఇంటిలో ఆడుతున్న వారికి చాలా ఉత్కంఠ భరితంగా ఉన్నాయి. గత వారం ఇంటి నుండి వరుణ్ సందేశ్ భార్య వితిక ఎలిమినేట్ కావడంతో...ప్రస్తుతం మీ ఇంటిలో ఉన్న సభ్యులు..వరుణ్ సందేశ్, బాబా భాస్కర్, శ్రీముఖి, రాహుల్, అలీ మరియు శివ జ్యోతి. తాజాగా 'టికెట్ టు ఫినాలే' ముందు జరుగుతున్న ఎపిసోడ్స్ లో రాహుల్ మరియు వరుణ్ సందేశ్ అలాగే అలీ మరియు బాబా భాస్కర్ లా మధ్య జరిగిన టాస్క్ లు యుద్ధ వాతావరణాన్ని తలపించాయి.


ముఖ్యంగా అలీ మరియు బాబా భాస్కర్ ఆడిన టాస్క్ అయితే బిగ్ బాస్ సీజన్ 3 కె చాలా ప్రమాదకరమైన టాస్క్ అని చాలా మంది చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్ చేశారు. ఇదిలా ఉండగా గేమ్ చివరాకరికి వచ్చేసిన నేపథ్యంలో శ్రీముఖి ఇంటిలో రాహుల్ ని గట్టిగా టార్గెట్ చేసి ఆడుతున్న గేమ్ ని బయట ఉన్న రాహుల్ ఆర్మీ శ్రీముఖి ని టార్గెట్ గా చేసుకుని సోషల్ మీడియాలో నెగటివ్ ప్రచారానికి తెరలేపారు.


మరో పక్క జబర్దస్త్ లో ఉన్న కంటెస్టెంట్స్ శ్రీముఖి ని గెలిపించాలని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుండగా..., రాహుల్ ఆర్మీ శ్రీముఖి ఆడుతున్న గేమ్ ని బేస్ చేసుకుని రాహుల్ ని ఏవిధంగా నెగిటివ్ గా హౌస్ లో చిత్రీకరించాలని ఆడిన గేమ్ ని సోషల్ మీడియాలో బయటపెడుతూ శ్రీముఖి కి వ్యతిరేకంగా రాహుల్ ఆర్మీ గట్టిగా ప్రచారం చేయడంతో శ్రీముఖి టైటిల్ విన్నర్ గెలుచుకోవడంలో ముందు ముందు చాలా ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని శ్రీముఖి పై  షో చూస్తున్న ప్రేక్షకుల దృష్టిలో అలాగే సోషల్ మీడియాలో నెటిజన్ల దృష్టి లో నెగిటివ్ ఇంపాక్ట్ పడే అవకాశం ఉందని చాలామంది అంటున్నారు. మొత్తం మీద రాహుల్ ఆర్మీ గేమ్ చివరకు వచ్చేసరికి శ్రీముఖి నీ గట్టిగా టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: