విజయ్ దేవరకొండ ఇప్పటి వరకు
బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వలేదు. భవిష్యత్ లో ఇస్తాడు అన్న క్లారిటీ కూడ లేదు. అయితే ఈ క్రేజీ హీరో
బాలీవుడ్ లో ఒక అరుదైన రికార్డ్ ను క్రియేట్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది.
విజయ్ నటించిన ‘అర్జున్ రెడ్డి’
బాలీవుడ్ లో ‘కబీర్ సింగ్’ పేరుతో రీమేక్ అయి సంచలనాలు సృష్టించిన విషయం అందరికీ తెలిసిందే.
అదేవిధంగా ‘డియర్ కామ్రేడ్’ మూవీ విడుదల కాకుండానే ఈ మూవీ
బాలీవుడ్ రీమేక్ రైట్స్ ను
కరణ్ జోహార్ తీసుకున్నాడు. అయితే ఈ మూవీ తెలుగులో ఫెయిల్ అవ్వడంతో
కరణ్ జోహార్ ఈ రీమేక్ విషయంలో వెనకడుగు వేస్తున్నట్లు టాక్. ఇది ఇలా కొనసాగుతూ ఉండగా
విజయ్ నటించిన ‘టాక్సీవాలా’ సినిమాను
బాలీవుడ్ లో త్వరలో రీమేక్ చేయబొతున్నారు.
ఇషాన్ ఖట్టర్ హీరోగా
అనన్య పాండే హీరోయిన్ గా ‘ట్యాక్సీవాలా’ రీమేక్ కాబోతోంది.
ఈ రీమేక్ కు 'ఖాలి పీలి' అనే టైటిల్ ను ఖరారు చేశారు. దీనికితోడు ఒక ప్రముఖ హిందీ నిర్మాణ సంస్థ ‘గీతాగోవిందం’ మూవీని
బాలీవుడ్ లో రీమేక్ చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఇలా
విజయ్ నటించిన తెలుగు సినిమాలు చాల సినిమాలు
బాలీవుడ్ లో రీమక్ అవ్వడం
విజయ్ దేవరకొండకు ఒక రికార్డ్ అని అంటున్నారు.
త్వరలో రాబోతున్న ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రం ఊహించిన విజయాన్ని సాధిస్తే ఈ మూవీ కూడ
బాలీవుడ్ లో రీమేక్ అయినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు. దీనితో
విజయ్ దేవరకొండ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వకుండానే
బాలీవుడ్ మీడియాకు హాట్ టాపిక్ గా కొనసాగుతున్నాడు. అందువల్లనే కాబోలు
టాలీవుడ్ యంగ్ హీరోలు ఎవరితోనూ నటించడానికి ఇష్టపడని
జాన్వీ కపూర్
విజయ్ తో నటించడానికి ఇష్టపడుతోంది అనుకోవాలి..