టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్
పూరి జగన్నాథ్ తీసిన
సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ గా నిలిచాయి.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘టెంపర్ ’ మూవీకి దర్శకత్వం వహించిన
పూరి ఆ తర్వాత ఒక్క
సినిమా కూడా హిట్ కాకపోవడంతో తీవ్ర నిరాశలో ఉన్నాడు. ఇదే సమయంలో
రామ్ పోతినేని సైతం ‘నేను శైలజ’ తర్వాత ఒక్క
సినిమా కూడా సక్సెస్ కాకపోవడంతో కెరీర్ పరంగా పీకల్లోతుల్లో మునిగిపోయాడు. వీరిద్దరికీ ఒక బంపర్ హిట్ కావాలి..ఈ నేపథ్యంలో మాస్ ఎలిమెంట్స్ తో కూడిన ఓ మూవీ తెరకెక్కించాలని నిర్ణయించుకున్నారు.
అందాల
తార ఛార్మీ నిర్మాతగా
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో
రామ్ హీరోగా ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీ తెరకెక్కించారు. అందరూ ఊహించిన విధంగానే ఈ మూవీలో
పూరి మార్క్, పంచ్ డైలాగ్స్, సూపర్ మ్యూజిక్ తో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్నాడు. ఈ మూవీతో సక్సెస్ తో
పూరి ఈజ్ బ్యాక్ అన్నారు. హీరో
రామ్ కెరీర్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన మూవీగా నిలిచిపోయింది. జూలై 18వ తేదీన 'ఇస్మార్ట్ శంకర్' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన ప్రతి ప్రాంతంలో ముఖ్యంగా మాస్ ఏరియాల్లో ఈ
సినిమా విజయవిహారం చేసింది.
ఈ మూవీ తర్వాత మరికొన్ని సినిమాలు థియేటర్లో సందడి చేసినా ‘ఇస్మార్ట్ శంకర్’ కీ ఏమాత్రం పోటీగా నిలవలేక పోయాయి. చాలా సినిమాల పోటీని తట్టుకుంటూ నిలబడిన ఈ
సినిమా, ఈ రోజుతో 100 రోజులను పూర్తి చేసుకోనుంది. ఇస్మార్ట్
శంకర్ లో
రామ్ మాస్ లుక్
తెలంగాణ యాస మాట్లాడటం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మరోవైపు
నిధి అగర్వాల్, నభా నటేశ్ గ్లామర్ డోస్ తో బాగా ఆకట్టుకున్నారు. మొత్తానికి పూర్తిగా
పూరి మార్కుతో వచ్చిన కారణంగానే ఈ సినిమాకి ఈ స్థాయి విజయం లభించిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.