బుల్లితెర మీద తన చిలిపితనంతో ఎంటర్టైన్మెంట్ షోలకు హోస్ట్ గా చేస్తూ ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది శ్రీముఖి. టివి ఆన్ చేస్తే చాలు ఏదో ఒక ఛానెల్ లో శ్రీముఖి హంగామా కనిపిస్తూనే ఉంటుంది. యాంకర్ గా ఫుల్ బిజీ అయిన శ్రీముఖి స్టార్ మా నిర్వహిస్తున్న బిగ్ బాస్ షోలో కంటెస్టంట్ గా వెళ్లింది. ఇంట్లో తనదైన స్టైల్ లో ఎంటర్టైన్ చేస్తూ అందరిని అలరిస్తుంది శ్రీముఖి.


అయితే చివరి రెండు వారాలకు చేరుకున్న బిగ్ బాస్ సీజన్ 3లో ఈ వారం రాహుల్ తప్ప మిగిలిన ఐదుగురు నామినేషన్స్ లో ఉన్నారు. అయితే ఈ క్రమంలో బిగ్ బాస్ ఇచ్చే టాస్కులు కూడా చాలా టఫ్ గా ఉన్నాయి. ఇదిలాఉంటే గురువారం ఎపిసోడ్ లో ఇంటి సభ్యులు తమ లైఫ్ లో జరిగిన కొన్ని బాధాకరమైన విషయాల గురించి చెప్పుకొచ్చారు.


ఈ క్రమంలో శ్రీముఖి తన లవ్ ఫెయిల్యూర్ గురించి చెప్పుకొచ్చింది. ప్రేమించిన వ్యక్తి తనని మోసం చేయడంతో చచ్చిపోదామని అనుకున్నానని శ్రీముఖి చాలా ఎమోషనల్ అయ్యింది. అయితే శ్రీముఖిని అంతగా ప్రేమించి మోసం చేసిన వ్యక్తి ఎవరన్నది ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద డిస్కషన్స్ పెట్టేస్తున్నారు. కొందరు యాంకర్ రవినే అంటుంటే మరికొందరు ప్రదీప్ మాచిరాజు అని కూడా అంటున్నారు.


రవితో పటాస్ షోలో బాగా ఫేమస్ అయ్యింది శ్రీముఖి. ఆ షోలోనే రవితో క్లోజ్ నెస్ పెరిగింది. వారి మధ్య చనువు చూసి వీళ్ల మధ్య ఏదో జరుగుతుందని అనుకున్నారు. అయితే శ్రీముఖి తను ప్రేమించిన వ్యక్తి కూడా ఓ సెలబ్రిటీ అని చెప్పడంతో వీరి మీద డౌట్లు ఎక్కువయ్యాయి. మొత్తానికి శ్రీముఖి తన బాధని పెంచుకోగా ఆమెను అభిమానించే ఫ్యాన్స్ మాత్రం షాక్ అయ్యారు.



మరింత సమాచారం తెలుసుకోండి: