చాలా రోజులనుండి  తమ అభిమాన హీరో నితిన్  నటిస్తున్న  భీష్మ అప్డేట్ కోసం ఎదురుచూస్తున్న  ఫ్యాన్స్ కు ఎట్టకేలకు  గుడ్ న్యూస్ చెప్పింది చిత్ర బృందం. ఈ నెల  27న  దీపావళి సందర్భంగా ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ ను విడుదలచేయనున్నారని అధికారికంగా ప్రకటించారు. దాంతో పాటు సినిమా రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించే అవకాశం ఉందనిసమాచారం. ఇటీవలే మేకర్స్ ఈ చిత్రం  డిసెంబర్ లో క్రిస్మస్ కానుకగా విడుదలవుతుందని  ప్రకటించారు  కానీ అనివార్య కారణాల వల్ల విడుదల తేదీని వాయిదావేశారు.  తాజా సమాచారం ప్రకారం  ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరి లో విడుదలచేయనున్నారని తెలుస్తుంది.



 ఛలో ఫేమ్ వెంకీ కుడుముల డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం  లో రష్మిక మందన్న కథానాయికగా నటిస్తుండగా మహతి స్వర సాగర్ సంగీతం  అందిస్తున్నాడు.  యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్మెంట్స్  నిర్మిస్తుంది. ఇక నితిన్ ఈ చిత్రంతో పాటు   తొలిప్రేమ ఫేమ్  వెంకీ అట్లూరి డైరెక్షన్ లో రంగ్ దే లోఅలాగే  సాహసం ఫేమ్ చంద్రశేఖర్ యేలేటి  డైరెక్షన్ లో ఓ సినిమాలో నటిస్తున్నాడు. రంగ్ దే లో నితిన్ సరసన కీర్తి సురేష్  హీరోయిన్ గా నటిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.  చంద్రశేఖర్ యేలేటి తెరకెక్కిస్తున్న  చిత్రంలో  నితిన్ కు జోడిగా  రకుల్ ప్రీత్ సింగ్ , మలయాళ బ్యూటీ  ప్రియా ప్రకాష్ వారియర్ నటిస్తున్నారు. భవ్య క్రియేషన్స్  పతాకంపై ఆనంద్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.  ఈరెండు సినిమాలు కూడా వచ్చే  ఏడాదే విడుదలకానున్నాయి.  మరి మరి అ ఆ తరువాత హ్యాట్రిక్ పరాజయాలను చవిచూసిన  నితిన్  వచ్చే ఏడాది ఈమూడు సినిమాలతో హ్యాట్రిక్ విజయాలను సాధిస్తాడో లేదో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: