ఈరోజు హిందీలోనూ రెండు ప్రముఖ సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో ఒకటి తుపాకీ సిస్టర్స్ గా పేరు తెచ్చుకున్న సాండ్ కి ఆంఖ్
సినిమా కాగా, రెండో
సినిమా హౌస్ ఫుల్ 4. ఈ రెండు సినిమాలు
హిందీ ప్రేక్షకులను మెప్పించాయి. రెండు అవుట్ అండ్ అవుట్ ఫన్ గా ఉండటంతో ఫ్రైడే బాక్సాఫీస్ ఫుల్ ఫిదా అయ్యింది. తాప్సి పన్ను, భూమిలు మెయిన్ రోల్ చేసిన సాండ్ కి ఆంఖ్
సినిమా మంచి వసూళ్లు సాధించింది. యూపీలో ఇద్దరు మహిళల
కథ ఇది. తమను తాము కాపాడుకోవడానికి తుపాకీ పట్టిన ఇద్దరు మహిళలు.. ఆ తరువాత జాతీయ స్థాయిలో జరిగిన ఎన్నో పోటీల్లో విజయం సాధించారు.
పతకాలు గెల్చుకున్నారు. ఈ కధాంశంతో తెరకెక్కిన
సినిమా సాండ్ కి ఆంఖ్. ఈ మూవీకి మంచి పేరు వచ్చింది. రియల్ స్టోరీగా వచ్చిన
సినిమా కావడంతో.. అంచనాలు కూడా అదే రేంజ్ లో ఉన్నాయి. ఇక ఇదిలా ఉంటె, ఈ మూవీతో పాటుగా హిందీలో
అక్షయ్ కుమార్ హీరోగా చేసిన హౌస్ ఫుల్ 4
సినిమా రిలీజ్ అయ్యింది. హౌస్ ఫుల్ సిరీస్ లో వచ్చిన నాలుగో
సినిమా ఇది.
అయితే, ఈ మూవీకి ఫన్ తో పాటుగా పునర్జన్మలను జోడించారు. పునర్జన్మలను జోడించి తీసిన ఈ
సినిమా మంచి ఫలితాలను ఇస్తోంది.
అక్షయ్ కుమార్ ఇందులో గుండుతో కనిపించాడు. నాలుగు వందల సంవత్సరాల క్రితం జరిగిన విషయాలు.. ప్రస్తుతం గుర్తుకు వస్తుంటే.. ఆయా పాత్రల మధ్య ఏం జరుగుతుంది. ఎలా జరుగుతుంది అన్నది కథ. దీనికి మంచి ఫన్ జోడించారు.
సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అన్ని సన్నివేశాలు నవ్వు తెప్పించే విధంగా ఉండటంతో సినిమాకు ప్లస్ అయ్యింది.
అప్పటి పాత్రలలో ఉన్న రిలేషన్.. ఇప్పటి పాత్రల్లో ఉన్న రిలేషన్ మారిపోవడంతో జరిగిన ఫన్ వర్కౌట్ అయ్యింది. ప్రతి ఒక్కరు థియేటర్లో సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు. నవ్వులు కాసులు బాగానే రాలుతున్నాయి.
బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఈరోజు రిలీజైన రెండు సినిమాలు పాజిటివ్ గా ఉండటంతో
బాలీవుడ్ ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు.
అక్షయ్ కుమార్, తాప్సిల సినిమాలు పోటాపోటీగా ఆడుతున్నాయి. ఒకటి పక్కా
కామెడీ, మరొకటి స్ఫూర్తి దాయకమైన సినిమాలు కావడంతో ఏ సినిమాను ఎంజాయ్ చేసే ప్రేక్షకులు ఆ సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు.