టాలీవుడ్ కోలీవుడ్ లో హీరోకు సమానంగా  పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్ ఎవరంటే టక్కున నయనతార పేరు వస్తుంది.  ఈమె ఒక సినిమాకి దాదాపు నాలుగు నుంచి ఐదు కోట్ల పారితోషికం తీసుకుంటున్నారు. నయనతార మొదటి శింబు ప్రేమలో పడింది వీరుఇద్దరు చాల కాలం చట్టా పటాలు వేసుకోని తిరిగారు కానీ ఆ  తర్వాత ఆ బంధం విడిపోయింది.కొన్ని రోజుల తర్వాత ప్రభుదేవాతో ప్రేమాయణం నడిపి పెళ్లి చేసుకుంటున్నారు  అన్న సమయంలో విడిపోయి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది ఈ జంట .

ఇప్పుడు ఆమె నటించిన 'నేను రౌడీనే' అనే సినిమా డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ ప్రేమలో పడింది. ఈ ముద్దుగుమ్మ ఇద్దరు కలిసి సహ జీవనం చేస్తున్నారనే వార్తలు కోలీవుడ్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తున్నాయి. ఇటీవలే తన ప్రియుడు విఘ్నేశ్ శివన్ బర్తడే అని చాలా ఘనంగా జరిపించింది.


 నయనతార నిన్న గురువారం తిరుమలలో నయనతార సందడి చేశారు.శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చిన ఆమె శ్రీవారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. ఆలయ రంగనాయకుల మండపంలో స్వామివారి లడ్డూప్రసాదాలు, చిత్రపటాలతో వేదాఆశీర్వచనం అందించారు. శ్రీవారి దర్శన అనంతరం నయనతారను చూసేందుకు అభిమానులు ఎగబడుతూ సెల్ఫీలు తీసుకున్నారు. ఆమెతో పాటు తమిళ డైరెక్టర్‌ విఘ్నేష్‌ శివన్‌ ఉన్నారు.


ఇటీవల విడుదలైన సైరా సినిమాలో మంచి పాత్ర పొందారు నయనతార కానీ తన కంటే తమన్నా పాత్ర నిడివి ఎక్కువ ఉండటం వల్ల ఒకింత అసహనానికి గురైనట్లు ఆమె సన్నిహితుల దగ్గర వాపోయినట్లు తెలుస్తోంది.నయనతార ఈ మధ్య ఎన్నడూ లేని విధంగా ఫోటోషూట్ లో కూడా పాల్గొంటుంది . వౌగ్ ఫోటోషూట్ లో మహేష్ బాబు ,దుల్క్కుర్ సల్మాన్ తో కలిసి పాల్గొన్నారు . .


మరింత సమాచారం తెలుసుకోండి: