టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ టైగర్ ఎన్టీయార్ టెంపర్ సినిమా నుండి వరుస విజయాలను అందుకుంటున్నారు. ప్రస్తుతం జూనియర్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఆర్.ఆర్.ఆర్ సినిమాలో రామ్ చరణ్ తో కలిసి నటిస్తున్నాడు. దాదాపు 400 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఎన్టీయార్ కొమరం భీం పాత్రలో నటిస్తున్నాడు. 2020 జులై 30వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతుంది. 
 
ఆర్.ఆర్.ఆర్ సినిమా తరువాత ఎన్టీయార్ ఎవరి దర్శకత్వంలో నటిస్తాడు అనే ప్రశ్నకు చాలామంది దర్శకుల పేర్లు సమాధానంగా వినిపిస్తున్నాయి. కొరటాల శివ, త్రివిక్రమ్ శ్రీనివాస్, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, తమిళ డైరెక్టర్ అట్లీ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అరవింద సమేత సినిమా తరువాత ఎన్టీయార్ కొరటాల కాంబినేషన్లో సినిమా మొదలు కావాల్సి ఉన్నా ఎన్టీయార్ కు ఆర్.ఆర్.ఆర్ సినిమా ఆఫర్ రావటంతో ఈ సినిమా పోస్ట్ పోన్ అయింది. 
 
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీయార్ నటించబోతున్నాడని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు త్రివిక్రమ్ అరవింద సమేత సినిమా సమయంలో జూనియర్ తో మరో సినిమా చేస్తానని చెప్పాడని సమాచారం. విజిల్ సినిమా ప్రమోషన్స్ లో తమిళ డైరెక్టర్ అట్లీ త్వరలో తెలుగులో ఒక స్టార్ హీరో సినిమాకు దర్శకత్వం వహిస్తానని ప్రకటన చేశాడు. ఆ స్టార్ హీరో ఎవరో కాదు జూనియర్ ఎన్టీయార్ అని తెలుస్తోంది. 
 
కానీ ఎన్టీయార్ ఫ్యాన్స్ మాత్రం అట్లీ దర్శకత్వంలో వద్దని ఎన్టీయార్ కు సూచిస్తున్నారు. తమిళ డైరెక్టర్ సూర్య ఖుషిలాంటి బ్లాక్ బస్టర్ పవన్ కళ్యాణ్ తో తీసినప్పటికీ అదే పవన్ తో కొమరం పులి, మహేశ్ బాబుతో నానిలాంటి డిజాస్టర్ సినిమాలు తీశాడు. తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ చిరంజీవితో స్టాలిన్, మహేశ్ బాబుతో స్పైడర్ లాంటి డిజాస్టర్ సినిమాలు తీశాడు. మరోవైపు తమిళ దర్శకుడు అట్లీ రొటీన్ మాస్ మసాలా సినిమాలు తీస్తున్నాడనే విమర్శలు వస్తున్నాయి. తమిళ డైరెక్టర్లు తెలుగు స్టార్ హీరోలకు అంతగా కలిసిరావటం లేదు కాబట్టి ఎన్టీయార్ తమిళ డైరెక్టర్ అట్లీతో సినిమా చేయవద్దని ఎన్టీయార్ అభిమానులు కోరుకుంటున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: