బిగ్ బాస్ సీజన్ 3 చివరి దశకు చేరుకోవడంతో రోజుకో ట్విస్ట్ ఇస్తున్నాడు బిగ్ బాస్. గడిచిన వారం బిగ్ బాస్ ఇచ్చిన టికెట్ టు ఫినాలే టాస్క్ లో భాగంగా రాహుల్ సిప్లిగంజ్ టికెట్ టు ఫినాలే మొదటి కంటెస్టంట్ గా ఫైనల్ కు వెళ్లాడు. ఇక మిగిలిన ఐదుగురు ఇంటి సభ్యులు నామినేట్ అయ్యారు. 


ఈ వారం మిగిలిన ఐదుగురిలో ఒకరు ఎలిమినేట్ అయ్యి నలుగురు ఫైనల్ వీక్ కు వెళ్తారు. ఇక వచ్చే వారం ఆ ఐదుగురిలో ఫైనల్ విన్నర్ ను ఆడియెన్స్ ఓటింగ్ ద్వారా నిర్ణయిస్తారు. అయితే శుక్రవారం ఎపిసోడ్ లో నామినేషన్స్ లో ఉన్న ఐదుగురు ఇంటి సభ్యులలో ఒక కంటెస్టంట్ ను బిగ్ బాస్ టికెట్ టు ఫినాలే అందించాడు.


నిద్రపోతున్న కంటెస్టంట్స్ నిద్ర భంగం కలిగించి మరి కంటెస్టంట్స్ ఇంట్లోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు పొందిన అనుభూతిని చెప్పమన్నాడు. అలా చెప్పగానే ఆడియెన్స్ ఓటింగ్ ద్వారా బాబా భాస్కర్ ను నామినేషన్స్ నుండి సేవ్ చేశాడు బిగ్ బాస్. ఉన్న ఐదుగురిలో ఒకరిని సేవ్ చేయగా మిగిలిన నలుగురు నామినేషన్స్ లో ఉన్నట్టే.    


అయితే ఆ నలుగురులో వరుణ్ సందేష్, శ్రీముఖు, అలి రెజా, శివ జ్యోతి ఉన్నారు. ఈ నలుగురిలో చూస్తే తప్పకుండా శివ జ్యోతి ఇంటి నుండి బయటకు వస్తుందని అనుకుంటున్నారు. అయితే ఈ వారం ఎలిమినేషన్స్ లో అలి రెజా బయటకు వచ్చినా రావొచ్చని చెప్పొచ్చు. మొదటి నుండి స్ట్రాంగ్ కంటెస్టంట్ గా ఉన్నా ఆల్రెడీ ఎలిమినేట్ అయ్యి వైల్డ్ కార్డ్ గా వచ్చాడు షో ఎలా ఆడియెన్స్ లోకి వెళ్తుందో తెలుసుకున్నాడు కాబట్టి అలి ఫైనల్ వీక్ కు వెళ్లకపోవచ్చు అని టాక్. రేపు నాగార్జున కూడా నామినేషన్స్ లో ఉన్న వారిలో ముందు శ్రీముఖిని తర్వాత వరుణ్ ను సేవ్ చేసి అలి, శివ జ్యోతిల ఇద్దరిలో ఒకరిని ఎలిమినేట్ చేయొచ్చని అంటున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: