ప్రతి ఏడాది మాదిరిగా ఈ ఏడాది కూడా సంక్రాంతి సందర్భంగా పలు సినిమాలు రిలీజ్ కు సిద్దమవుతున్న విషయం తెలిసిందే. ఇక వీటిలో సూపర్ స్టార్ మహేష్ సరిలేరు నీకెవ్వరు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమాలు బరిలో నిలవడంతో పాటు, ఏకంగా ఈ రెండు భారీ సినిమాలు కూడా ఒకే రోజున ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మహేష్ ఇప్పటికే రెండు వరుస సక్సెస్ లు అందుకుని మంచి జోరుతో ఈ సినిమాలో నటిస్తుండడం, అలానే కెరీర్ లో ఇప్పటి వరకు ఒక్క ఫెయిల్యూర్ కూడా లేని అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకుడు కావడంతో సరిలేరు పై సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు టాలీవుడ్ ప్రేక్షకుల్లోనూ మంచి అంచనాలు ఉన్నాయి. 

ఇక దానితో పాటు బన్నీ మరియు త్రివిక్రమ్ కాంబినేషన్లో రాబోతున్న అల వైకుంఠపురములో సినిమాపై కూడా తారా స్థాయిలో అంచనాలు నెలకొని ఉన్నాయి. దానికి ప్రధాన కారణం, ఇదివరకు బన్నీ మరియు త్రివిక్రమ్ ల కాంబినేషన్లో వచ్చిన రెండు సినిమాలు కూడా మంచి సక్సెస్ అవడంతో, ఈ సినిమా కూడా తప్పకుండా వారిద్దరి కాంబోలో హ్యాట్రిక్ హిట్ గా నిలవడం ఖాయమని బన్నీ ఫ్యాన్స్ మరియు ప్రేక్షకులు నమ్ముతున్నారు. ఇకపోతే వీటితో పాటు నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎంత మంచివాడవురా, అలానే బాబీ దర్శకత్వంలో వెంకటేష్, నాగచైతన్యలు హీరోలుగా తెరకెక్కుతున్న వెంకీ మామ సినిమాలు కూడా ఉన్నాయి. 

అయితే వీటితో పాటు నందమూరి బాలకృష్ణ హీరోగా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమాను కూడా తొలుత సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేయాలని భావించారట సినిమా యూనిట్. అయితే అప్పటికే పలు సినిమాలు ఆ సమయానికి రిలీజ్ పక్కాగా ప్లాన్ చేయడంతో, బాలకృష్ణ తమ సినిమాను కొంత ముందుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారట. రేపు టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ కానున్న ఈ సినిమా, ఎక్కువశాతం డిసెంబర్ లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందట. అయితే దీనిపై రేపే అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం కనపడుతోంది.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: