తెలుగు  బుల్లితెరపై వస్తున్న బిగ్ బాస్ 3 షో కేవలం కొన్ని రోజులు మాత్రమే ఉంది. ప్రస్తుతం ఇంట్లో కొనసాగుతున్న సభ్యులు బాబా భాస్కర్, అలీ రెజా,వరుణ్ సందేశ్,రాహూల్, శివజ్యోతి,శ్రీముఖి.  అయితే బిగ్ బాస్ 3 చివరి అంకానికి చేరుకోవడంతో ఇంటి సభ్యులకు గట్టి టాస్క్ లు ఎదుర్కోవాల్సి వస్తుంది.  ఈ నేపథ్యంలో ఇంటి సభ్యుల మద్య వాదనలు, మనస్పర్ధలు మొన్న ఏకంగా మ్యాన్ హ్యాండిలింగ్ వరకు టాస్క్ లు వెళ్లాయి.  అయితే నిన్న బిగ్ బాస్ లో ఇంటి సభ్యులను సూట్ కేసులు సర్ధుకోమని చెప్పడంతో అందరూ షాక్ కి గురయ్యారు. 

ఆ తర్వాత ఒక్కొక్కరి గార్డెన్ లో నిలబెట్టి బిగ్ బాస్ లో తమ జర్నీ ఎలా సాగింది అన్న విషయంపై మనసు విప్పి మాట్లాడమన్నారు. దాంతో ఇంట్లో ఎలా ఉన్నాం..బయట ఎలా ఉన్నాం..ఇంట్లో ఏం నేర్చుకున్నాం అన్న విషయంపై అందరూ మనసు విప్పి చెప్పారు.  ఆ తరువాత బిగ్ బాస్ హౌస్ మేట్స్ ఒక్కొక్కరిపై గ్రీన్ లైట్, రెడ్ లైట్ వేస్తూ ఆర్పుతూ ఫైనల్ గా బాబా భాస్కర్  ఈ వారం ప్రేక్షకులు వేసిన ఓట్లతో బాబా సేవ్ అయినట్లు బిగ్ బాస్ అనౌన్స్ చేశారు. అంతే కాదు టాప్ 5 లోకి చేరారు. 


ప్రస్తుతం ఇంటిలో ఆరుగురు సభ్యులు ఉండగా, ఎలిమినేట్ అయ్యే ఆ ఒక్కరు ఎవరన్నది సస్పెన్స్‌గా మారింది.   ప్రేక్షకులు తమ ఓట్ల ద్వారా బాబాను రక్షించి ఫైనల్‌కు పంపినట్టు చెప్పడంతో బాబా భాస్కర్ ఆశ్చర్యపోయాడు. బిగ్‌బాస్‌కు, ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపాడు. అనంతరం బాబాను కన్ఫెషన్‌ రూముకి పిలిచిన బిగ్‌బాస్ ‘టికెట్ టు ఫినాలే’ను అందించాడు. మిగిలిన వారిలో ఎవరు నామినేట్ కాబోతున్నారో వీకెండ్ లో నాగార్జున అనౌన్స్ చేస్తారని బిగ్ బాస్ చెప్పారు





మరింత సమాచారం తెలుసుకోండి: