రాబోతున్న సంక్రాంతి రేస్ బన్నీ మహేష్ ల ఇగో వార్ గా మారిన పరిస్థుతులలో ఈరెండు మూవీలలో ఏమూవీ పై చేయి సాధిస్తుంది అన్న విషయమై రకరకాల అంచనాలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులలో ఇప్పటికే తన ‘అల వైకుంఠపురములో’ మూవీ ప్రమోషన్ ను చాల ముందుగా మొదలు పెట్టిన బన్నీ ఎత్తుగడలకు చెక్ పెడదామని ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ నిర్మాతలు చెప్పిన సలహాలను మహేష్ తిరస్కరించినట్లు టాక్.

ఇప్పటికే ‘అల వైకుంఠపురములో’ మూవీకి సంబంధించిన ‘సామజవరగమన’ పాట తన సంచలనాన్ని కొనసాగిస్తూ ఉంటే ఈరోజు దీపావళి సందర్భంగా మరి కొద్ది సేపట్లో ఈ మూవీకి సంబంధించిన ‘రాములొ రాముల’ పాట విడుదల కాబోతోంది. దీనికి చెక్ పెట్టడానికి మహేష్ సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’ కు సంబంధించి విజయశాంతి మహేష్ లు కలిసి ఉన్న ఒక స్టిల్ ను ఇదే దీపావళికి రిలీజ్ చేయబోతున్నారు. 

అయితే ఇక్కడితో ‘సరిలేరు నీకెవ్వరు’ హడావిడి ఆపుచేయమని ఆతరువాత డిసెంబర్ రెండవ వారం నుండి ఈమూవీ ప్రమోషన్ ను తీవ్రస్థాయిలోకి తీసుకు వెళదామని మహేష్ చెప్పినట్లు టాక్. అంతేకాదు ప్రమోషన్ కు సంబంధించి అన్ని ముఖ్య అస్త్రాలు ముందుగానే లీక్ అయితే ఆ తరువాత క్రేజ్ పెంచుకోవడానికి ఇక ఏమి మిగలదని మహేష్ కామెంట్స్ చేసినట్లు తెలుస్తోంది. 

దీనితో మహేష్ బన్నీ స్ట్రాటజీకి రివర్స్ లో వెళుతూ తన స్పెషాలిటీ చూపెడుతూ ఎలాంటి ఖంగారు లేకుండా వ్యూహాలు రచిస్తున్నాడని అంటున్నారు. ఈ పరిస్థితులు ఇలా కొనసాగుతూ ఉంటే ఒకేరోజు విడుదల కాబోతున్న ఈ మూవీలను ఎవరికి వారు అత్యధిక ధియేటర్లలో విడుదలచేసి ప్రత్యర్ధికి చెక్ పెట్టాలి అన్న వ్యూహంతో ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో జరుగుతున్న ధియేటర్స్ వార్ మహేష్ బన్నీల ఆదిపత్య పోరుగా మారింది అన్న వార్తలు వినిపిస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: