పూరీ జగన్నాధ్ ఇపుడు ఇస్త్మార్ట్ గా కనిపిస్తున్నాడు. చాలా ఏళ్ళుగా ఆకలి మీద ఆయన ఉన్నాడు, దానికి తగ్గట్లుగా బ్లాక్స్ బస్టర్ హిటి ఒకటి పడింది. ఇక చూస్కో నా జోరు అంటున్నాడు. ఇపుడు ఆయన
విజయ్ దేవరకొండతో
మూవీ చేస్తున్నాడు. ఈ మూవీలో హీరోయిన్ ఎవరు అన్నది సస్పెన్స్ గా ఉంది. అయితే ఇక్కడ కూడా హైప్ క్రియేట్ చేసి
బాలీవుడ్ వరకూ తన బొమ్మను లాగేయాలయని
పూరి భారీ స్కెచ్ వేశాడు.
అదెలాగంటే
శ్రీదేవి కూతురు
జాన్వీ కపూర్ ని టాలీవుడ్లో ఎంట్రీ ఇప్పించి ఈ మూవీని
బాలీవుడ్ వరకూ తీసుకెళ్ళాలని పూరీ గట్టిగా ట్రై చేస్తున్నాడు. తెలుగులో చేస్తే
విజయ్ తో చేస్తానని అప్పట్లో
జాన్వీ అన్న మాటను పట్టుకుని ఆమెను ముగ్గులోకి లాగుతున్నాడు. ఈ దెబ్బతో అటు
జాన్వీ ఎంట్రీ తానే చేయించిన క్రెడిట్ తో పాటు బాలీవుడ్లోకి తన ఎంట్రీ సులువు అవుతుందని పూర్తీ తెలివైన ప్లాన్ వేశాడు.
దీనికోసం ఆయన చేయని ప్రయత్నం లేదని అంటున్నారు. జాన్వీని ఎలాగైనా ఇంప్రెస్ చేసి తన మూవీలో నటింపచేయలని పూరీ వీర లెవెల్లో టాలెంట్ అంతా చూపిస్తున్నాడని
టాలీవుడ్ టాక్. అయితే
జాన్వీ ఇప్పటికే బాలీవుడ్లో చాలా మూవీస్ కమిట్ అయి ఉంది. దాంతో
ఆమె ఎస్ అని చెప్పకపోవచ్చు అంటున్నారు. అయితే పూరీ మూవీస్ కో
ప్రొడ్యూసర్ గా ఉన్న చార్మీ ఇపుడు అదే పనిలో ఉందిట జాన్వీని ఒప్పించేందుకు
ఆమె బాలీవుడ్లో మకాం వేసినట్లుగా న్యూస్ వైరల్ అవుతోంది. మరి చూడాలి
జాన్వీ ఏమంటుందో. మరో వైపు జాన్వీని గ్రాండ్ గా తెలుగులో ఎంట్రీ ఇప్పించాలను
ఆమె తండ్రి బడా
నిర్మాత అయిన
బోనీ కపూర్ భావిస్తున్నారు. మరి పూరీ సినిమాలో
జాన్వీ నటించేందుకు ఆయన ఒకే చెబుతారా అన్నది కూడా చూడాలి అంటున్నారు.