లక్ష్మీకళ్యాణం సినిమాతో డైరెక్టర్ తేజ దర్శకత్వంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో కి మరియు వెండితెరపైకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కాజల్ అగర్వాల్ అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరి పక్కన హీరోయిన్ గా నటించి సౌత్ ఇండస్ట్రీ లోనే స్టార్ హీరోయిన్ గా క్రేజ్ ని సంపాదించింది. ఇండస్ట్రీలోకి వచ్చి చాలా సంవత్సరాలు గడుస్తున్నా ఎక్కడా కూడా తన క్రేజ్ తగ్గకుండా అవకాశాలు తగ్గి పోకుండా కాజల్ అగర్వాల్ అద్భుతంగా రాణిస్తోంది. ఇదిలా ఉండగా ఒకానొక సమయంలో టాలీవుడ్ ఇండస్ట్రీ పై సౌత్ ఇండస్ట్రీ పై అనేక వివాదాస్పద వ్యాఖ్యలు చేసి బాలీవుడ్ లోకి వెళ్లి పోయిన కాజల్ అగర్వాల్ కి అక్కడ చేసిన సినిమాలు వరుసగా ఫ్లాప్ కావడంతో తిరిగి తనకు లైఫ్ ఇచ్చిన సౌత్ వైపు చూడటంతో ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీ లో అనేక సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్ మళ్లీ అయిపోయింది.


ఇటువంటి నేపథ్యంలో తన కెరియర్ కి సంబంధించిన అనేక విషయాలను ఒక టాక్ షో లో తెలియజేసింది. ఈ సందర్భంగా కాజల్ అగర్వాల్ షోలో మాట్లాడుతూ...తన కెరియర్ లో చాలామంది డైరెక్టర్స్ తో పని చేశాను కానీ ఒక్క డైరెక్టర్ తో మాత్రం మళ్లీ పని చేయాలని అనుకోవటం లేదు అంటూ షాకింగ్ విషయం తెలియజేసింది. ఆ డైరెక్టర్ మరెవరో కాదు బాలీవుడ్ ఇండస్ట్రీకి దీపక్ టిజోరీ. మూడు సంవత్సరాల క్రితం కాజల్ నటించిన హిందీ సినిమా 'దో లఫ్జోంకీ కహానీ'లో హీరోగా రణ్ దీప్ హుడా నటించాడు.


ఆ సినిమాలో రణ్ దీప్ తో కాజల్ ఇంటిమేట్  సీన్స్ కాస్త ఎక్కువగా ఉంటాయి. ఆ సినిమా గురించి కాజల్ అగర్వాల్ చెబుతూ ఒక అందరూ అంధురాలు పాత్రలో..హీరో బెడ్ రూమ్ సన్నివేశాలలో నటించాలి. అటువంటి సీన్స్ చేయడం నాకు ఇష్టం లేదు కానీ డైరెక్టర్ చెప్పిన విధంగానే చేయటం జరిగింది. దీంతో అటువంటి డైరెక్టర్ తో మళ్ళీ వర్క్ చేయకూడదని అప్పుడే డిసైడ్ అయిపోయాను. సౌత్ ఇండస్ట్రీ లో ఉన్న డైరెక్టర్ లు చాలా మంచివాళ్లు ఇప్పటివరకు ఎవరితో కూడా నాకు మనస్పర్ధలు... ఇబ్బందులు రాలేదని కాజల్ అగర్వాల్ చెప్పుకొచ్చింది.


మరింత సమాచారం తెలుసుకోండి: