టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోల సరసన నటించి తర్వాత లేడీ సూపర్ స్టార్, లేడీ అమితాబ్ గా పేరు తెచ్చుకున్నారు విజయశాంతి. తర్వాత లేడీ ఓరియెంటెడ్ మూవీస్ లో ఎక్కువగా నటించడంతో పెద్దగా వర్క్ ఔట్ కాకపోవడం..దాంతో ఆమె సినిమాలకు దూరం కావడం జరిగింది.  తర్వాత రాజకీయాల్లోకి వెళ్లిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆమెతో ఎంతో మంది నటింపజేయాలని చూసినా సెట్ కాలేదు.  ప్రస్తుతం ఆమె టి కాంగ్రెస్ లో కొనసాగుతున్నారు.  దాదాపు రెండు దశాబ్దాల తర్వాత అనీల్ రావిపూడి దర్శకత్వంలోమహేష్ బాబు హీరోగా నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీలో నటిస్తున్నారు విజయశాంతి.


బాలనటుడిగా ఆమెతో మహేష్ బాబు నటించిన విషయం తెలిసిందే. సరిగ్గా 30 ఏళ్ల క్రితం వచ్చిన ‘కొడుకు దిద్దిన కాపురం’లో విజయశాంతి, మహేష్ బాబు కలిసి నటించారు. అందులో వీరిద్దరూ తల్లి కొడుకులుగా నటించిన విషయం తెలిసింది. అప్పట్లో ఆ సినిమాను కృష్ణ దర్శకత్వం వహించడం విశేషం. సరిగ్గా 30 ఏళ్ల తర్వాత విజయశాంతితో మరోసారి ‘సరిలేరు నీకెవ్వరూ’ సినిమాలో కలిసి నటిస్తున్నారు మహేష్. మొత్తానికి మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరూ’ సినిమాతో ఆమె సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు.  దీంతో ఈ మూవీలో ఈ లేడీ సూపర్‌స్టార్‌ పాత్రపై అందరిలోనూ ఆసక్తి, అంచనాలు భారీగా పెరిగిపోయాయి.


తాజాగా దీపావళి కానుకగా ‘సరిలేరు నీకెవ్వరూ’ టీం ఈ చిత్రంలో విజయశాంతి ఫస్ట్‌ లుక్‌ను రిలీజ్‌ చేశారు. ఈ మూవీలో విజయశాంతి భారతి పాత్రలో చాలా డీసెంట్‌ అండ్‌ క్లాస్‌గా కనిపించనున్నట్లు అర్థమవుతోంది. చాలా లాంగ్‌ గ్యాప్‌ తర్వాత తమ అభిమాన నటి ఫస్ట్‌ లుక్‌ చూసి  ఫ్యాన్స్‌ తెగ ఆనందపడుతున్నారు. అంతేకాకుండా లేడీ సూపర్‌స్టార్‌ ఈజ్‌ బ్యాక్‌ అంటూ కామెంట్‌ చేస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: