మహానటి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్
కీర్తి సురేష్. ఈ సినిమాలో సావిత్రిగా చేసిన
కీర్తి తనకంటే ఎవరూ బాగా చేయలేరనిపించేలా నటించింది.
సినిమా చూస్తున్నంతసేపు అందరూ సావిత్రినే చూశారు.
కీర్తి ఏ కోశానా కనబడలేదు. అందుకే ఆ
సినిమా ఆమెకి జాతీయ నటిగా అవార్డును తెచ్చి పెట్టింది. ఈ
సినిమా తర్వాత
కీర్తి చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తుంది. కథల విషయంలో పర్టిక్యులర్ గా ఉంటూ తనకి సూటయ్యే పాత్రలనే ఎంచుకుంటుందట.
తెలుగు, తమిళంతో పాటు అటు
బాలీవుడ్ లో ఓ సినిమాలో నటిస్తున్న
కీర్తి వరుసగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కమిటవుతోంది. ఛాలెంజింగ్ పాత్రలు చేయాలనే ఉద్దేశ్యంతో విభిన్నమైన కథాంశాలని ఎంచుకుంటుంది. ముఖ్యంగా ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ పాత్రలున్న సినిమాల్లోనే నటించడానికి ఆసక్తి చూపిస్తుంది.ఇప్పటికే రెండు నాయికా ప్రధాన చిత్రాలకు సంతకాలు చేస్తే వాటిలో ఒకదానికి `మిస్ ఇండియా` అనే టైటిల్ ని ఖరారు చేశారు.
తాజాగా దీపావళిని పురస్కరించుకుని
నగేష్ కుకునూర్ దర్శకత్వం వహిస్తున్న వేరొక చిత్రానికి `గుడ్ లక్ సఖీ` అనే టైటిల్ ని ఫైనల్ చేశారు. ఇది క్రీడా నేపథ్యం ఉన్న సినిమా.
కీర్తి ఇందులో షూటర్ పాత్రలో కనిపించనుంది. ఇటీవల
కీర్తి సురేష్ పుట్టినరోజు నాడు ఈ చిత్ర ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో
ఆది పినిశెట్టితో పాటు జగపతి బాబు కూడా నటిస్తున్నారు.
దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు సమర్పణలో వర్త్ ఏ షాట్ అనే ప్రొడక్షన్ నిర్మిస్తుంది.
ఇప్పటికే సగభాగం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మరికొద్ది రోజుల్లో విడుదలకు సిద్ధం అవుతోంది. మరి షూటర్ గా
కీర్తి మెప్పిస్తుందా లేదా చూడాలి. ఈ చిత్రం ప్రేక్షకులని ఆకట్టుకోవాలని కోరుకుంటూ గుడ్ లక్ కీర్తి.