టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్
పూరి జగన్నాథ్-ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన ‘టెంపర్’
మూవీ తర్వాత ఒక్క హిట్ కూడా అందుకోలేదు. దాంతో ఈసారి గట్టి హిట్ కొట్టాలని కసిమీద ఉన్న
పూరి జగన్నాథ్ కి ఎనర్జిటిక్ స్టార్
రామ్ పోతినేని జత అయ్యాడు. వీరిద్దరి కాంబినేషన్ లో అందాల
భామ ఛార్మీ నిర్మాతగా ‘ఇస్మార్ శంకర్’ రూపొందింది. హీరో
రామ్ సరసన ధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా నటించారు. మరో ముఖ్యపాత్రలో
సత్య దేవ్ నటించారు. పూరీ కనెక్ట్స్,
పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యానర్లపై
పూరి జగన్నాథ్, ఛార్మి ఈ
సినిమా నిర్మించారు.
మణిశర్మ సంగీతం సమకూర్చారు.
ఇస్మార్ట్
శంకర్ మూవీ జూలై 18న గ్రాండ్గా విడుదలైన సంగతి తెలిసిందే. రీసెంట్గా ఈ
మూవీ వంద రోజులు పూర్తి చేసుకుంది. రామ్ లుక్, బాడీ లాంగ్వేజ్, మేనరిజమ్స్
పూరి స్టైల్ ఆఫ్ టేకింగ్ సినిమాని ఓ రేంజ్లో నిలిపేలా చేసాయి.
మణిశర్మ అందించిన సంగీతానికి మంచి మార్కులే పడ్డాయి. ఇటీవల దసరా సందర్భంగా ఈ
మూవీ బుల్లితెరపై ప్రసారం అయింది.
మాస్ ఎలిమెంట్స్కి సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్ జోడించి తన మార్క్తో
సినిమా తీసాడు పూరీ.
ఈ మూవీతో డాషింగ్ డైరెక్టర్ మరోసారి అందరి దృష్టిలో పడ్డాడు. ఇక
దసరా పండుగ కానుకగా బుల్లితెరపై సందడి చేశాడు ఇస్మార్ట్ శంకర్. 16.63 పాయింట్స్ టీఆర్పీ రాబట్టి అందరిని ఆశ్చర్యపరచింది. మహేష్ నటించిన మహర్షి
సినిమా కన్నా 180 శాతం రేటింగ్ ఈ
మూవీ రాబట్టడం విశేషం. ఇస్మార్ట్ శంకర్ మూవీకి ఇంత టీఆర్పీ రావడంతో చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేసింది.