ఎమోషనల్‌ ఎంటర్‌ టైనర్‌గా తెరకెక్కుతున్న  ‘వెంకీమామ’చిత్ర సరికొత్త పోస్టర్ ను దీపావళి కానుకగా రిలీజ్ చేసారు. ఈ పోస్టర్ లో చైతు ఆర్మీ ఆఫీసర్ గా కనిపించనుండగా..వెంకటేష్ పల్లెటూరు వ్యవసాయ దారుడిగా కనిపించబోతున్న సంగతి తెలిసిందే.  బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో  ఆర్ ఎక్స్ 100 హీరోయిన్  పాయల్  పుత్ రాజ్ వెంకీకి జంటగా, రాశి ఖన్నా చైతు కి జోడిగా నటిస్తున్నారు. విభిన్నమైన కథాకథనాలతో పూర్తి వినోదభరితంగా ఈ మల్టీ స్టారర్ తెరకెక్కనుంది.

యూత్.. మాస్.. ఫ్యామిలీ ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలతో ఈ కథను తీర్చిదిద్దినట్టుగా చెబుతున్నారు. కె.ఎస్‌.ర‌వీంద్ర (బాబీ) డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ బ్యాన‌ర్‌పై డి.సురేష్‌బాబు, టీజీ విశ్వ‌ప్ర‌సాద్ , పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో రెండో షెడ్యూల్‌ పూర్తి  చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న ఈ చిత్రం తాలూకా దీపావళి గిఫ్ట్ వచ్చి అభిమానులను ఆకట్టుకుందని వెంకీ అభిమానులు అంటున్నారు.


దేశానికి వెన్నెముక‌లైన జై జైవాన్ అంటై సైనికుడిగా నాగ‌చైత‌న్య‌, జై కిసాన్ అంటూ రైతు పాత్ర‌లో వెంక‌టేశ్ ఉన్న పోస్ట‌ర్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటుంది. తదుపరి సినిమా కశ్మీర్‌లో చిత్రీకరణ కోసం  ప్రస్తుతం కశ్మీర్‌లో లొకేషన్ల వేటలో ఉన్నారు దర్శకుడు బాబీ. ఈ షెడ్యూల్‌లో నాగచైన్యపై సన్నివేశాలను చిత్రీకరిస్తారని సమాచారం.  

సినిమా రిలీజ్ విష‌యంలో చిత్ర యూనిట్ ఎలాంటి క్లారిటీ ఇవ్వ‌లేదు. వెంకీ స‌ర‌స‌న పాయ‌ల్ రాజ్‌పుత్‌, నాగ‌చైత‌న్య స‌ర‌స‌న రాశీఖ‌న్నా హీరోయిన్స్‌గా న‌టిస్తుండగా త‌మ‌న్ సంగీతాన్ని అందిస్తున్నారు. రీసెంట్‌గా విడుద‌లైన ఈ సినిమా టీజ‌ర్‌కి కూడా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.ప్రస్తుతం చిత్ర రిలీజ్ విషయంలో చిత్ర యూనిట్ అపుసోపాలు పడుతున్నారు. డిసెంబర్ కు రిలీజ్ చేయాలా..సంక్రాంతి కాగా అనేది తేల్చుకోలేకపోతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: