మూవీ ఆర్టిస్ట్స్ అసోషియేషన్ లో గొడవలు రోడ్డెక్కాయి. వాళ్ళలో వాళ్ళు కొట్టుకుని చివరికి ఎటూ తేలక రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. మా అధ్యక్షుడైన నరేష్ ,ఎగ్జిక్యుటివ్ వైస్ ప్రెసిడెంట్ & సెక్రటరీ జీవితా రాజశేఖర్ ల మధ్య విభేధాలు చెలరేగడంతో ఇరువురు ప్రెస్ మీట్లు పెట్టి మరీ ఒకరి మీద అభాండాలు వేసుకుంటున్నారు. నరేష్ ఒక వర్గం, జీవితా ఒక వర్గంగా ఏర్పడి మాట్ల తూటాలు పేల్చుకున్నారు.


ఈ విభేధాలకి కారణాలు ఎవరికి వారికి ఉన్నాయి. కానీ ముఖ్య కారణం అహంభావం అని అంటున్నారు. అధ్యక్షుడు లేకుండా మీటుంగులేమిటి? అంటూ నరేష్ ప్రశ్నిస్తే.. ఇది సాధారణ సమావేశమని జీవిత వివరణ ఇచ్చే ప్రయత్నం చేయడం..అటుపై ఒకరినొకరు విమర్శించుకోవడంతో వివాదం మరింత ముదరింది. కారణాలు ఏవైనా `మా ` పరువు  బజారున పడుతోంది.


వాళ్ళలో వాళ్ళు ఎంత కొట్టుకున్నా బయట పడేది కాదు. కానీ బయటకొచ్చి మరీ ఒకరి మీద ఒకరు అరుచుకోవడం, తిట్టుకోవడం చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు. ఇండస్ట్రీ పెద్దలు సైతం మా లో జరిగిన అల్లర్ల వల్ల షాక్ కి గురవుతున్నారు. ఒకే కుటుంబంలా కలిసి ఉండాల్సిన నటీనటులు ఇలా దెబ్బలాడుకోవడం సుతారమూ నచ్చలేదు. అయితే ఇక ముందైనా వీరు కలుస్తారనే నమ్మకం లేకుండా పోయింది. 


దాంతో రంగంలోకి మా వ్యవస్థాపకులు దిగుతున్నారట. ఈ విషయంపై  మెగాస్టార్ చిరంజీవి- కృష్ణంరాంజు- మోహన్ బాబు రంగంలోకి దిగినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ముగ్గురు ఇటీవలే ఓ స్టార్ హోటల్లో సమావేశమై ఆర్టిస్టుల సంఘం లుకలుకలపై చర్చించినట్లు తెలిసింది.  ఈ మేరకు ఇరు గ్రూపులని పిలిచి వారి మధ్య సయోధ్య కుదిర్చాలని అనుకుంటున్నట్టు సమాచారం. మరి ఈ సయోధ్య కుదురుతుందో లేదో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: