ఉపాసన ఈ పేరు కొత్తగా చెప్పనక్కర లేని పేరు ఎందుకంటే మనందరి మెగా స్టార్
చిరంజీవి కోడలు,మెగా పవర్ స్టార్
రామ్ చరణ్ భార్య,అపోలో అధినేత అపోలో హాస్పిటల్స్ విస్తరణలో తనదైన పాత్ర పోషిస్తూ అందరి మన్ననలు పొందుతున్న మంచి మనిషి.
అంతేకాదు సామాజిక కార్యక్రమాల్లో తన దైన ముద్ర వేస్తూ ఎందరినో ఆశ్చర్య పరుస్తున్న
ఆమె ఎంతో మందికి అండగా నిలుస్తూ మనసున్న మనిషిగా అందరి హృదయాల్లో నాటుకు పొయ్యారు.
రామ్ చరణ్తో
పెళ్లి తర్వాత ఏకంగా 14 కిలోలు తగ్గి ఎందరికో స్ఫూర్తి దాయకం అయింది
ఉపాసన, మంచి ఆరోగ్య సూత్రాలను చెబుతూ,వాటిని ఫాలో అవుతూ,పూర్తి ఫిట్ గా ఉన్న పర్ఫెక్ట్ మెగా కోడలు.తన సోషల్
మీడియా ద్వారా ప్రజలకు అత్యంత బాగా దెగ్గరతున్నారు.
దీనికి తోడు టైం దొరికినప్పుడల్లా ఏమి లేని నిరు పేదలకు, అనాథ బాలలకు సాయం చేస్తూ మంచి మనసున్న మనిషిగానూ స్థిరపడి పొయ్యారు. తను చేసే సేవలకు యావత్ భారత దేశం నుండి ఆశీర్వాదాలు రావడం,ప్రభుత్వం కూడా గుర్తించడంతో ఆ మధ్య
ఉపాసన కొణిదెలకు ప్రతిష్టాత్మక
దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది.అంటే అంత ఆషా మాషీ కాదు. అందుకే
ఆమె ఇక పై ప్రేక్షకులకు దెగ్గర గా ఉండి వాళ్ళ సమస్యలు తీర్చలని చూస్తుందంట.ఎంత మంది చేరువవుతారో వేచి చూద్దాం.
ఉపాసన తాజాగా తన సోషల్
మీడియా అకౌంట్ ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్లో
బాలీవుడ్ హీరోయిన్ కత్రీనాకు శుభాకాంక్షలు తెలిపారు. కత్రీనా ఈ మధ్య కాస్మోటిక్ బిజినెస్లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.దాంతో
ఆమె బిసినెస్ అభివృద్ధి చెంది సక్సెస్ అవ్వాలని
ఆమె శుభాకాంక్షలు తెలిపి
కత్రినా మనసులో మంచి స్థానం సంపాదించుకుంది.కత్రినా కూడా థాంక్స్ చెబుతూ జరిగిన ఈ సంభాషణ చాలా అద్బుతం అని అంటున్నారు అభిమానులు.కత్రినా కి
ఉపాసన సపోర్ట్ అదిరిపోతుంది లే...