మాస్ మహారాజా
రవితేజ ప్రస్తుతం విఐ
ఆనంద్ దర్శకత్వంలో 'డిస్కోరాజా' సినిమాని చేస్తున్న విషయం తెల్సిందే. 2020
జనవరి లో డిస్కోరాజా
సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని ఫిల్మ్
నగర్ నుండి అందిన సమాచారం. దాదాపు టాకీ పార్ట్ కంప్లీట్ అయిన ఈ
సినిమా వచ్చే నెలలో మొత్తం షూటింగ్ పూర్తి కాబోతుందట. 'రాజా ది గ్రేట్' తర్వాత మళ్ళీ హిట్ ఇంతవరకు
రవితేజ అకౌంట్ లో పడలేదు. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న
మాస్ రాజా ఈమద్య కాలంలో కాస్త స్లో అయిన సంగతి తెలిసిందే. అయితే
రవితేజ 'డిస్కోరాజా' విడుదలకు ముందే మరో సినిమాను ప్రకటించి బ్యాక్ టు బ్యాక్ సినిమాలని లైన్ లో పెట్టాడు.
ఇక
రవితేజ 65వ సినిమాగా డిస్కో
రాజా తెరకెక్కుతుండగా.. 66వ సినిమాకు సంబంధించి అఫిషియల్ అనౌన్స్ మెంట్
దీపావళి సందర్బంగా చిత్ర బృందం వెల్లడించారు.
రవితేజ హీరోగా
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో డాన్ శీను, బలుపు సినిమాలు వచ్చాయి. ఆ రెండు సినిమాలు మంచి సక్సస్ ను సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు వీరి కాంబోలో హ్యాట్రిక్ మూవీకి రంగం సిద్దం అయ్యింది. వీరిద్దరి కాంబోలో లేటెస్ట్ గా తెరకెక్కబోతున్న 66 వ
మూవీ అధికారిక ప్రకటన రిలీజ్ అయింది.
పోలీస్ స్టోరీ బ్యాక్ డ్రాప్ తో ఈ
సినిమా రూపొందబోతుందని హింట్ ఇస్తూ ఈ సినిమాను అనౌన్స్ చేశారు చిత్ర యూనిట్. ఇక ఈ సినిమాని ఠాగూర్ మధు నిర్మించబోతున్నాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుపుకుంటున్న ఈ
సినిమా వచ్చే నెలలో ప్రారంభం కాబోతుంది.
2020 సమ్మర్ లో ఈ
సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తుంది. ఇక సినిమాకు సంబంధించిన హీరోయిన్, ఇతర టెక్నీషియన్స్ వివరాలు వచ్చే నెలలో షూటింగ్ ప్రారంభోత్సవంకు ముందు ప్రకటించనున్నారట.