షార్ట్ ఫిలింస్‌తో డైరెక్టర్ గా కెరీర్‌ ప్రారంభించి, ఆ తర్వాత సినిమాల వైపు వచ్చారు దర్శకుడు తరుణ్ భాస్కర్. ఆయన తెరకెక్కించిన 'పెళ్లి చూపులు' సినిమా ఏ రేంజ్ సక్సస్ ను అందుకుందో అందరికి తెలిసిందే. అంతేకాదు సురేష్ ప్రొడక్షన్స్ లో వరుసగా సినిమాలు కమిటయ్యాడు. అయితే ఉన్నట్టుండి హీరో అవతారమెత్తాడు తరుణ్. అయితే అలా హీరో అయ్యాక తన భార్య తనతో మాట్లాడటం మానేసిందని అంటున్నారు. తరుణ్ భాస్కర్ దర్శకుడి నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పరిచయమై ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఆయన హీరోగా నటించిన 'మీకు మాత్రమే చెప్తా' త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా తరుణ్ సినిమా గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

నేను సినిమాల్లోకి వెళ్తానన్నప్పుడు మా ఇంట్లో వాళ్ళు వద్దన్నారు. అయితే ఎవరు ఏం చెప్పినా వినవద్దు, నచ్చిన పని చేసుకుంటూ పో అని అమ్మ నాకు చెప్పింది. అదే ఫాలో అవుతున్నాను. 'మీకు మాత్రమే చెప్తా' ట్రైలర్‌కు వచ్చిన స్పందన చూసి ఇప్పుడు మా ఇంట్లో వారు కూడా సంతోషిస్తున్నారు. కొడుకు తెరపై కనిపిస్తుంటే ఏ తల్లికి మాత్రం ఆనందంగా ఉండదు చెప్పండి. కాకపోతే నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేసినందుకే నా భార్య మాట్లాడలేదు. కానీ ఇప్పుడు తను కూడా సపోర్ట్ చేస్తోంది. ఈ సినిమాకు తనే కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేసింది...అని ఈ ఆసక్తికరమైన విషయాలను బయటకు చెప్పాడు. 

ఇక మరో పక్క సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో విక్టరీ వెంకటేష్ హీరోగా ఒక సినిమాని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఈ సినిమాలో వెంకటేష్ క్యారెక్టర్ చాలా డిఫ్రెంట్‌గా ఉంటుందని తెలుస్తుంది. వెంకీ కూడా ఈ సినిమా మీద అంతే ఆసక్తిగా ఉన్నాడు. అసలే వెంకీకి ప్రయోగాలంటే చాలా ఇష్టం అన్న విషయం తెలిసిందే. అందుకే ఈ సినిమా మీద చాలా ధీమాగా ఉన్నాడట. ఇక తరుణ్ లాంటి యంగ్ డైరెక్టర్ కి వెంకీ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ ఇంత త్వరగా రావడం అంటే మామూలు విషయం కాదని చెప్పుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: