బాలీవుడ్ స్టార్ హీరో
అక్షయ్ కుమార్ ఫ్లాప్ చూసి చాలా కాలమే అయింది. ఇంకా చెప్పాలంటే దాదాపు నాలుగేళ్ళు కావస్తుంది. జాలీ ఎల్.ఎల్.బ్-2, టాయిలెట్ ఏక్ ప్రేం
కథ, ప్యాడ్ మాన్, మిషన్ మంగళ్..ఇలా వరుస బ్లాక్ బస్టర్స్ తో మంచి ఊపు మీదున్న
అక్షయ్ కి రీసెంట్గా రిలీజైన హౌస్ ఫుల్ 4 గట్టి షాకిచ్చింది. ఈ దెబ్బతో
అక్షయ్ అకౌంట్ లో భారీ ఫ్లాప్ పడింది.
బాలీవుడ్ లో ఈ వారం మూడు సినిమాలు రిలీజయ్యాయి. వీటిలో హౌస్ ఫుల్ 4 క్రేజీ తారాగణంతో భారీ అంచనాల మధ్య రిలీజైంది. బడ్జెట్ కాన్వాస్ పరంగా భారీ
సినిమా అని అందరికి తెలిసిందే. పైగా పోస్టర్లు ఎంతో క్రియేటివ్ గా చూపించి
సినిమా మీద విపరీతమైన క్రేజ్ ని పెంచారు. కానీ ఏమాత్రం లాభం లేకుండా పోయింది. అసలు ఈ
సినిమా కథేంటో థియోటర్స్ కి వెళ్ళిన వాళ్ళకి అర్థం కాక బుర్ర గోక్కుంటు బయటకు వస్తున్నారట.
ట్రైలర్ లో చూపించినట్టే.. మూడు జంటలు అక్షయ్-పూజ, తుషార్-కృతి సనోన్, బాబీ డియోల్- కృతి కర్బంద జంటల మధ్య పునర్జన్మల
కథ తో రూపొందించారు. మునుపటి జన్మలో నిశ్చితార్థం చేసుకుంటారు. ప్రస్తుత జన్మలో ఆ ముగ్గురు యువకులు లండన్లో బార్లు నడుపుతుంటారు.
పెళ్లి కోసం ఆ ముగ్గురూ భారతదేశానికి వచ్చినప్పుడు తమ గతం గురించి తెలుసుకుంటారు. ఆ తర్వాత హీరోయిన్స్ తో ఈ హీరోలులు ఎలాంటి డ్రామా నడిపించారు? అన్నదే కథాంశం. ఓవైపు మగధీర షేడ్స్ మరోవైపు
బాహుబలి షేడ్స్ తో ఈ సినిమాని
పులిహోర చేశారని జనాలు చెప్పుకుంటున్నారు.
ఇందులో ఒక్క రానా క్రూరమైన పాత్ర తప్ప ఇంకేదీ ఆకట్టుకోలేదట. కొంతమందైతే
అక్షయ్ కి ఇది టైమ్ వేస్ట్
సినిమా అని చెప్పుకుంటున్నారట.
బాలీవుడ్ లో ఈ సినిమాకి రేటింగ్ 1 స్టార్ 2 స్టార్ తప్ప అంతకుమించి ఇవ్వలేదు. మొత్తానికి ఈ సీజన్ లో ఓ చెత్త
సినిమా చూసిన ఫీలింగ్ ఆడియెన్ కి కలుగుతోందట. ఇకపోతే తాప్సీ నటించిన సాంద్ కి ఆంఖ్
సినిమా అదే రోజు రిలీజైంది. ఈ
సినిమా కొంత బెటర్ అన్న టాక్ వినిపించింది.
రాజ్ కుమార్ రావ్- మౌనిరాయ్ జంటగా నటించిన 'మేడ్ ఇన్ చైనా' సోసో గానే ఉందట. మొత్తానికి
బాలీవుడ్ లో ఈ వారం రిలీజైన 3 సినిమాలు ఫ్లాప్ దిశగా నడుస్తున్నాయి.