ప్రస్తుతం స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతూ విపరీతమైన ప్రేక్షకాభిమానంతో మరియు మంచి క్రేజ్ తో దూసుకెళ్తున్న క్రేజీ షో బిగ్ బాస్. ఇప్పటికే ఈ షోకు సంబంధించి ప్రసారం అయిన రెండు సీజన్స్ కూడా ఎంతో అత్యద్భుతమైన విజయాన్ని అందుకోవడంతో, ఈ మూడవ సీజన్ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అనుకున్న విధంగా
నాగార్జున హోస్ట్ గా మొదలైన ఈ షోకు స్పందన బాగానే రావడం జరిగింది. అయితే ఈ సీజన్ బిగినింగ్ సమయంలో కొంత మేర కొద్దిపాటి వివాదాలు చుట్టుముట్టినప్పటికీ ఆ తరువాత అవి సమసిపోవడంతో,
మెల్లగా ప్రేక్షకులు కూడా బాగా షోకి కనెక్ట్ అవడం మొదలెట్టారు. ఇక ఆ తరువాత నుండి మంచి జోష్ తో సాగిన ఈ షో, ప్రస్తుతం చివరి అంకానికి చేరుకుంది. ఇక ప్రస్తుతం షోలో
శివ జ్యోతి,
బాబా భాస్కర్,
వరుణ్ సందేశ్, ఆలీ,
రాహుల్,
శ్రీముఖి తదితరులు మాత్రమే షోలో మిగిలారు. అయితే వీరిలో ఇప్పటికే
రాహుల్ మరియు
శ్రీముఖి ఇద్దరూ కూడా సేఫ్ అవడం మరియు ఫైనల్ కు చేరడం జరిగింది. వారు కాకుండా మిగిలిన నలుగురిలో నేడు జరిగే షో ద్వారా ఎవరు ఫైనల్ కు చేరుకుంటారు అనే దానిపై ప్రేక్షకుల్లో ఎంతో ఉత్కంఠత నెలకొని ఉంది. ఇకపోతే నేడు
దీపావళి పండుగను పురస్కరించుకుని,
నేటి షోకి ప్రత్యేక అతిథిగా
టాలీవుడ్ యూత్ సెన్సేషల్ స్టార్
విజయ్ దేవరకొండని ప్రత్యేకంగా ఆహ్వానించినట్లు, స్టార్ మా యాజమాన్యం వారు కాసేపటి క్రితం ప్రోమోని రిలీజ్ చేసారు.
నాగార్జున గారితో కలిసి సందడి చేసిన
విజయ్ దేవరకొండ, హౌస్ మేట్స్ లోని ఒక్కొక్కరితో కలిసి ఎంతో సరదాగా మాట్లాడిన క్లిప్పింగ్స్ మనం ప్రోమోలో చూడవచ్చు. ఇక ఈ ప్రోమో ప్రస్తుతం
యూట్యూబ్ లో దూసుకుపోతోంది. ఇక
విజయ్ రాకతో నేటి షోపై ప్రేక్షకుల్లో మరిన్ని అంచనాలు పెరిగాయి అనే చెప్పాలి...!!