మెగాస్టార్ అల్లుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన సాయి ధరమ్ తేజ్ మొదట్లో మంచి సినిమాలు తీస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ ఆ తర్వాత వరుసగా అతని సినిమాలు నిరాశ పరుస్తూ వస్తున్నాయి. ఈ క్రమంలో దాదాపు అరడజను పైగా సినిమాలు అడ్రస్ లేకుండా వెళ్లిపోయాయి. ఆ తర్వాత కథ ఎంపికలో జాగ్రత్త తీసుకుంటున్నాడు


చిత్రలహరి చిత్రంతో మంచి విజయం అందుకొన్న సుప్రీం హీరో సాయి తేజ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ప్రతి రోజూ పండగే’. మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఈ సినిమాను చిత్రీకరిస్తున్నారు  దర్శకుడు మారుతి గారు . సాయి ధరమ్ తేజ్ ను కొత్త రకమైన పాత్ర తో, న్యూ లుక్ లో కనిపించబోతున్నారు . అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించే లాగా  కుటుంబ బంధాల్ని, విలువల్ని ఎమోషనల్‌గా చిత్రీకరిస్తున్నారు.

బాహుబలి లో క‌ట్టప్పగా తెలుగు ప్రేక్షకుల‌కి  చేరువైన ప్రముఖ న‌టులు స‌త్య‌రాజ్ క్యారెక్టర్ ని ఈ సినిమా ద‌ర్శకుడు మారుతి ప్రత్యేకంగా డిజైన్ చేశారు. అలానే ఈ సినిమాలో న‌టిస్తున్న మ‌రో న‌టుడు రావు ర‌మేశ్ పాత్ర కూడా హైలెట్‌గా ఉండబోతోంది.సాయితేజ్, మారుతి కాంబినేష‌న్ లో తెర‌కెక్కనున్న ప్రతిరోజూ పండుగే చిత్రంపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.

సుప్రీమ్ హీరో సాయి తేజ్, ఢిల్లీ బ్యూటీ రాశీ ఖ‌న్నా సుప్రీమ్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రం తర్వాత మరోసారి కలిసి నటిస్తున్నారు. ఈ పండగ  సందర్భం గా ఈ చిత్ర యూనిట్ కొత్త పోస్టర్ విడుదల చేసారు .ఈ సినిమా డిసెంబర్ 20 న విడుదల కి సిద్ధం చేస్తున్నారు .ఈ సినిమా ఘనవిజయం సాధించాలి అని  కోరుకుంటున్నాము .ఈ సినిమా లోని పాటలు కూడా త్వరలో  వస్తాయి అని చెప్తున్నారు 


మరింత సమాచారం తెలుసుకోండి: