కోలీవుడ్ లో సూపర్ హిట్ అయిన తడం రీమేక్ గా తెరకెక్కనుంది ఈ చిత్రం. శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్ పై రామ్ బాబాయ్ స్రవంతి రవి కిషోర్ నిర్మించనున్న ఈ చిత్రానికి సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ సంగీతం అందించనున్నాడు. ఇక ఈచిత్రం యొక్క టైటిల్ అలాగే ఫస్ట్ లుక్ నురేపు సాయంత్రం 4:30గంటలకు విడులచేయనున్నారు. యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో రామ్ సరసన నేల టిక్కెట్టు ఫేమ్ మాళవిక శర్మ, అలాగే చిత్రలహరి ఫేమ్ నివేత పేతురాజ్ హీరోయిన్లుగా నటించనున్నారని వార్తలు వస్తున్నాయి.
కాగా రామ్ - కిషోర్ తిరుమల కాంబినేషన్ లో ఇది మూడో సినిమా. ఇంతకుముందు వీరి కలయికలో వచ్చిన నేను శైలజ హిట్ అవ్వగా ఉన్నది ఒక్కటే జిందగీ యావరేజ్ అనిపించుకుంది. మరి ఇప్పుడు ఈ మూడో చిత్రం వీరికి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదలచేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు వెలుబడనున్నాయి.