గత కొన్నేళ్లుగా  సరైన  హిట్ కోసం ఎదురుచూసిన ఎనర్జిటిక్  హీరో రామ్  ఇటీవల  ఇస్మార్ట్ శంకర్  చిత్రం  వచ్చి ఎట్టకేలకు   బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాడు. డ్యాషింగ్  డైరెక్టర్  పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఈ చిత్రం  60కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి రామ్  కెరీర్ లోనే  అత్యధిక  వసూళ్లను సాధించిన  చిత్రం గా  రికార్డు సృష్టించింది.  ఈసినిమా తరువాత  కొంచెం  గ్యాప్ తీసుకున్న రామ్  తాజాగా  కిషోర్ తిరుమల  డైరెక్షన్ లో నటించాడనికి ఓకే చెప్పాడు.  దీపావళి సందర్భంగా   ఈరోజు  రామ్ ఈ విషయాన్నీ సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు.


కోలీవుడ్ లో సూపర్ హిట్ అయిన తడం  రీమేక్  గా తెరకెక్కనుంది ఈ చిత్రం.   శ్రీ స్రవంతి  మూవీస్ బ్యానర్ పై రామ్ బాబాయ్  స్రవంతి రవి కిషోర్  నిర్మించనున్న ఈ చిత్రానికి  సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్  మణిశర్మ  సంగీతం అందించనున్నాడు. ఇక ఈచిత్రం  యొక్క  టైటిల్  అలాగే  ఫస్ట్ లుక్ నురేపు  సాయంత్రం 4:30గంటలకు  విడులచేయనున్నారు. యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో  రామ్ సరసన  నేల టిక్కెట్టు  ఫేమ్ మాళవిక శర్మ, అలాగే చిత్రలహరి ఫేమ్ నివేత పేతురాజ్ హీరోయిన్లుగా నటించనున్నారని  వార్తలు వస్తున్నాయి.  



కాగా రామ్ - కిషోర్ తిరుమల  కాంబినేషన్ లో ఇది మూడో సినిమా. ఇంతకుముందు వీరి కలయికలో వచ్చిన  నేను శైలజ హిట్ అవ్వగా  ఉన్నది ఒక్కటే జిందగీ  యావరేజ్ అనిపించుకుంది. మరి ఇప్పుడు ఈ మూడో చిత్రం  వీరికి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. ఈ చిత్రాన్ని  వచ్చే ఏడాది  సమ్మర్ లో విడుదలచేయడానికి  సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు వెలుబడనున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: