ఈ
సినిమా పీరియాడిక్ లవ్ స్టోరీతో తెరకెక్కుతోంది.
ఇటలీ నేపథ్యంలో ఈ
సినిమా కథ ఉంటుందని తెలుస్తోంది. మొదట ఈ సినిమాను 180 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కించాలని నిర్మాతలు అనుకున్నారు. కానీ
సాహో సినిమా ఫలితం తరువాత 120 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో
జాన్ సినిమాను నిర్మించాలని అనుకున్నట్లు తెలుస్తోంది. ఈ
సినిమా మొదటి షెడ్యూల్ ఇటలీలో జరిగింది.
కానీ రెండవ షెడ్యూల్ మాత్రం హైదరాబాద్ లోనే ఇటలీకి సంబంధించిన సెట్ వేసి షూటింగ్ చేయబోతున్నారని సమాచారం. 1970 సంవత్సరంలో జరిగే లవ్ స్టోరీగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. జగపతిబాబు ఈ సినిమాలో మరో ముఖ్య పాత్రలో నటించబోతున్నాడని తెలుస్తోంది. నిర్మాతలు
2020 దసరా పండుగకు ఈ సినిమాను విడుదల చేసే ఆలోచనలో ఉన్నారని సమాచారం.
జాన్ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ఎక్కువగా ఉండవని తెలుస్తోంది.
నవంబర్ నెల మొదటివారం నుండి
జాన్ సినిమా రెండవ షెడ్యూల్ మొదలు కాబోతుంది. ఈ
సినిమా కథ అద్భుతంగా ఉందని ఫిల్మ్
నగర్ వర్గాల నుండి సమాచారం అందుతోంది. ఈ సినిమాలో
పూజా హెగ్డే సరికొత్త పాత్రలో కనిపించబోతుందని తెలుస్తోంది. హైదరాబాద్ లో ఈ
సినిమా సెట్ కు సంబంధించిన పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. సాహోతో ప్రేక్షకులను నిరాశపరిచిన
ప్రభాస్ జాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొడతాడని
ప్రభాస్ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.