యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా జాన్. సాహో సినిమా విడుదలైన రెండు నెలల తరువాత ప్రభాస్ జాన్ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. సాహో సినిమా విడుదల కాకముందే జాన్ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ప్రభాస్ కు జోడీగా పూజా హెగ్డే ఈ సినిమాలో నటిస్తోంది. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ బ్యానర్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 
 
సినిమా పీరియాడిక్ లవ్ స్టోరీతో తెరకెక్కుతోంది. ఇటలీ నేపథ్యంలో ఈ సినిమా కథ ఉంటుందని తెలుస్తోంది. మొదట ఈ సినిమాను 180 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కించాలని నిర్మాతలు అనుకున్నారు. కానీ సాహో సినిమా ఫలితం తరువాత 120 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో జాన్ సినిమాను నిర్మించాలని అనుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా మొదటి షెడ్యూల్ ఇటలీలో జరిగింది. 
 
కానీ రెండవ షెడ్యూల్ మాత్రం హైదరాబాద్ లోనే ఇటలీకి సంబంధించిన సెట్ వేసి షూటింగ్ చేయబోతున్నారని సమాచారం. 1970 సంవత్సరంలో జరిగే లవ్ స్టోరీగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. జగపతిబాబు ఈ సినిమాలో మరో ముఖ్య పాత్రలో నటించబోతున్నాడని తెలుస్తోంది. నిర్మాతలు 2020 దసరా పండుగకు ఈ సినిమాను విడుదల చేసే ఆలోచనలో ఉన్నారని సమాచారం. 
 
జాన్ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ఎక్కువగా ఉండవని తెలుస్తోంది. నవంబర్ నెల మొదటివారం నుండి జాన్ సినిమా రెండవ షెడ్యూల్ మొదలు కాబోతుంది. ఈ సినిమా కథ అద్భుతంగా ఉందని ఫిల్మ్ నగర్ వర్గాల నుండి సమాచారం అందుతోంది. ఈ సినిమాలో పూజా హెగ్డే సరికొత్త పాత్రలో కనిపించబోతుందని తెలుస్తోంది. హైదరాబాద్ లో ఈ సినిమా సెట్ కు సంబంధించిన పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. సాహోతో ప్రేక్షకులను నిరాశపరిచిన ప్రభాస్ జాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొడతాడని ప్రభాస్ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: