ఈ మధ్య కాలంలో హిట్ సినిమాలు లేని హీరోలలో ఒకరు నితిన్.. నితిన్ కు సినిమాలు లేవు. దానితో హిట్ అనే మాటకు దూరమై చాలా కాలం అయింది. శ్రీనివాస కళ్యాణం సినిమా ప్రేక్షకులను ఆ పోయింది. ప్రస్తుతం నితిన్ ఓ సినిమాలో నటిస్తున్నారు. ఆ సినిమానే భీష్మ.. సినిమా మొదలై చాలా కాలం అయింది. ఇప్పటవరకూ ఈ అప్డేట్ లేదు. ఈరోజు దీపావళి కానుకగా ఈరోజు ఈ చిత్ర పోస్టర్ ను రిలీజ్ చేశారు..

ఆ పోస్టర్ లో హీరో కాస్త రొమాంటిక్ గానే కనిపిస్తాడు.. హీరోయిన్ నడుమును పట్టుకోవడానికి చాలా కష్టపడతారు. హీరో ఆ దృశ్యం చూసిన ఎవరికైనా కూడా అర్థమవుతుంది. మరోసారి హార్ట్ ఎటాక్ చూపిస్తాడు అని అందరూ అంటున్నారు. ఈ చిత్ర హీరో నితిన్, ‘ఛలో’ దర్శకుడు వెంకీ కుడుముల కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం ‘భీష్మ’. రష్మిక మందన హీరోయిన్. సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.

ఇకపోతే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనుల్లో బిజీగా ఉంది. రెండు పోస్టర్లు ఒకేసారి రిలీజ్ కావడంతో నితిన్ అభిమానులు ఆనందపడుతున్నారు. ఒక పోస్టర్ వైలెన్స్ చూపిస్తే..మరో పోస్టర్ కాస్త అల్లరితో రొమాంటిక్ యాంగిల్ రుచి చూపిస్తున్నారు. ఇకపోతే.. విజయ్ బ్యూటీ రష్మిక మందన్నా ఈ సినిమాలో హిరోయిన్ గా నటిస్తున్నారు.

ఇది ఏమైనా కూడా దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ విడుదల చేసిన ఈ రెండు పోస్టర్లు విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇవే పోస్టర్లను నితిన్ ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. దీన్ని బట్టి చూస్తే నితిన్ కు ఈ సినిమా పక్కా హిట్ అని అంటున్నారు.భీష్మ’తో నితిన్ హిట్టు అందుకోవాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. కాగా, దీంతో పాటు మరో మూడు సినిమాలను నితిన్ చేస్తున్నారు. ‘ ఈ భీష్మ సినిమా వచ్చే ఏడాదిలో రిలీజ్ అవుతుందని సమాచారం...


మరింత సమాచారం తెలుసుకోండి: