దీపావళి కానుకగా
మహేష్ బాబు నటిస్తున్న 'సరిలేరు నీకెవ్వరూ' సినిమాలో
అజయ్,
వెన్నెల కిషోర్ పాత్రలను వెరైటీగా ఓ వీడియో రూపంలో రివీల్ చేశారు. స్టార్ సినిమాలు వస్తున్నాయంటే చాలు అభిమానుల్లో
సినిమా అప్ డేట్స్ మీద ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది.ప్రమోషన్లలో భాగంగా చిన్న చిన్న లీకులు ఇవ్వడం కూడా
సినిమా వల్లే కావాలని చేస్తూ ఉంటారు.కానీ కధ మొత్తం తెలిసిన, లేదా టిస్టులు,క్లైమాక్స్ ల కురించి ఏ మాత్రం లీకేజీ కాకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు దర్శకులు.
ఒక్కో సారి
సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇచ్చే ఇంటర్వ్యూ లలో నటి నటులు, లేదా దర్శకులు నోరు జారీ సినిమాలోని హై లెట్ సీన్స్ గురించి పొరపాటున చెప్పేస్తుంటారు.ఇప్పుడు
మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ
సినిమా విషయంలో కూడా అదే జరిగింది.
మహేష్ బాబు మేజర్
అజయ్ కృష్ణ గా నటిస్తున్న సరిలేరు నీకెవ్వరూ అనే థీమ్ సాంగ్ ను రివీల్ చేశారు.ఆ తరువాత విజయశాంతికి సంబంధించిన పోస్టర్, రష్మికకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేసి వారి పాత్రలను రివీల్ చేశారు.
అజయ్ క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్ కోటిగా కనిపిస్తుంటే..
వెన్నెల కిషోర్ ఆయనకు అసిస్టెంట్ గా కనిపిస్తున్నారు.
అజయ్,
వెన్నెల కిషోర్ ఇద్దరు కూర్చొని
సినిమా కథ గురించి చర్చించుకుంటూ ఉన్న వీడియోని రివీల్ చేశారు. ట్రైన్
ఎపిసోడ్, కర్నూల్
ఎపిసోడ్,
ప్రకాష్ రాజ్,
రష్మిక, ఆ తరువాత హీరో ఎంట్రీ అని చెప్పుకుంటూ ఉండగా దర్శకుడు
అనిల్ రావిపూడి అక్కడి రావడం, ఏం జరుగుతుందని ప్రశ్నించగా, కొంచం స్క్రీన్ ప్లే.. స్టోరీ చెప్తున్నా అని చెప్పడంతో కొంచం కాదు.. ప్రీ క్లైమాక్స్ వరకు వెళ్లిపోయారని అని చెప్పడం..
సంక్రాంతి వరకు ఆగాలని చెప్పడంతో వీడియో ముగుస్తుంది.
అంటే
సినిమా షూటింగ్ ప్రీ క్లైమాక్స్ వరకు పూర్తయిందని అర్ధం చేసుకోవచ్చు. వచ్చే ఏడాది
జనవరి 12 న
సినిమా రిలీజ్ కాబోతున్నది. సంక్రాంతికి పోటీ విపరీతంగా పెరిగిపోతున్నది.
మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ
సినిమా కూడా జోష్ ను పెంచింది.
దీపావళి సందర్భంగా మూడు పోస్టర్లు రిలీజ్ చేసింది. అది చాలదన్నట్టు సాయంత్రం సమయంలో టపాస్ లాంటి వీడియోను తీసుకొచ్చింది.