స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ త్రివిక్రమ్  కాంబినేషన్ లో  తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ  అల .. వైకుంఠపురములో..  నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకుంటున్న  ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలకానుంది. ఇప్పటికే  ప్రమోషన్స్ ను కూడా  స్టార్ట్ చేసింది చిత్ర బృందం. అందులో  భాగంగా  ఇటీవల  ఈ చిత్రం నుండి  విడుదలైన  'సామజవరగమన' సాంగ్ సూపర్  రెస్పాన్స్ ను తెచ్చుకుని  సాంగ్ అఫ్ ది ఇయర్ అనిపించుకుంది.  అంతేకాదు ఈసాంగ్  ఇప్పటివరకు అత్యధిక లైక్స్ ను రాబట్టుకున్న తెలుగు సాంగ్ గా కూడా రికార్డు క్రియేట్ చేసింది. 




ఇక తాజాగా   దీపావళి కానుకగా  నిన్న ఈ చిత్రం నుండి  రెండో సాంగ్  'రాములో రాముల'  విడుదల కాగా  ఈ సాంగ్ కూడా  యూనానిమస్ పాజిటివ్  రెస్పాన్స్  తో  24గంటల్లోనే 8.3 మిలియన్ల వ్యూస్ ను రాబట్టుకుంది. తద్వారా  ఒక్క రోజు లోనే అత్యధిక  వ్యూస్ ను  రాబట్టుకున్న సౌత్ సాంగ్ గా రికార్డు సృష్టించింది.  సెలెబ్రేషన్  సాంగ్ గా  వచ్చిన  రాములో రాముల ప్రస్తుతం 8.4 మిలియన్ల వ్యూస్ తో  యూట్యూబ్ లో ట్రెండింగ్ లో  కొనసాగుతుంది.  ఈరెండు పాటలు  సినిమా పై వున్న అంచనాలను అమాంతంగా పెంచేశాయి.  




పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈచిత్రంలో బన్నీ  సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా నటిస్తుండగా  ఆయనకు జోడిగా  పూజాహెగ్డే నటిస్తుంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో   టబు , జయరాం , మురళి శర్మ , నవదీప్ , సుశాంత్ , నివేత పేతురాజ్  ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.   గీతా ఆర్ట్స్ , హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ల పై అల్లు అరవింద్,రాధాకృష్ణ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: