ఏదైనా
పండుగ వచ్చిందంటే చాలు ఇక మన ఫిలిం మేకర్లు తమ సినిమాల ఫస్ట్ లుక్ పోస్టర్లతో, టీజర్లతో, ఫస్ట్ సింగిల్స్ తో సందడి చేస్తారు.
దీపావళి సందర్భంగా మరోసారి అది రిపీట్ అయింది. ఇటు
అనుష్క 'నిశ్శబ్దం' ప్రీ-టీజర్ రిలేజ్ అయిందో లేదో అటు
సాయి ధరమ్ తేజ్ 'ప్రతిరోజూ పండగే'
సినిమా మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ రెండు సినిమాల జోనర్స్ వేరే అయినప్పటికి పోటా పోటీగా తమ ఫ్యాన్స్ కి సర్ప్రైజ్ ఇచ్చారు.
'నిశ్శబ్దం' నుండి వచ్చిన ప్రీ-టీజర్ లో మొదట ఒక దట్టమైన అడవిలో ఉండే ఇంటిని చూపించారు. తర్వాత
మాధవన్ వయోలిన్ ప్లే చేస్తూ ఉంటారు. నెక్స్ట్ షాట్ లో వేళ్ళతో
అనుష్క ఒక ముద్రను అభినయిస్తూ ఉంటుంది. స్మశానంలో ఒక పూలతో అలంకరించిన శవపేటిక.. చుట్టూ నిలుచున్న జనంతో మరో సీన్.. తర్వాత ఒక ఆడిటోరియంలో కరతాళ ధ్వనులు చేస్తుంటారు...ఈ సీన్లకు లింక్ ఏంటి అనేది టీజర్ రిలీజ్ అయితే మనకు కొంత క్లారిటీ వచ్చే చాన్స్ ఉంది. ఈ సినిమాలో అనుష్క..
మాధవన్ తో పాటుగా అంజలి..
షాలిని పాండే..మైఖేల్ మ్యాడిసన్.. అవసరాల శ్రీనివాస్.. సుబ్బరాజు ఇతర కీలక పాత్రల్లో నటించారు.
హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.
ఇక 'ప్రతిరోజు పండగే' మోషన్ పోస్టర్ లో సాయి ధరమ్ తేజ్..
రాశి ఖన్నా..
సత్యరాజ్ తో సహా ఈ సినిమాలోని నటీనటులంతా ఒక ఉమ్మడికుటుంబం తరహాలో ఒక ఫ్యామిలీ ఫోటోకు పోజిచ్చారు. అందరూ ఫుల్ సెలబ్రేషన్ మూడ్ లో ఉన్నారు.
కామెడీ ఎంటర్టైనర్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన
మారుతి దర్శకత్వంలో 'ప్రతిరోజు పండగే' తెరకెక్కుతోంది. జీఎ2 పిక్చర్స్.. యూవీ క్రియేషన్స్ బ్యానర్లు ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
డిసెంబర్ 20 న ఈ
సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక
మారుతి కి మంచి హిట్ పడి చాలా రోజులైంద్. కాబట్టి ఈ సినిమాతోనైనా గట్టి హిట్ కొట్టే ప్రయత్నం చేస్తున్నాడని తెలుస్తుంది.