తెలుగులో
సూపర్ స్టార్ సరసన
భరత్ అనే నేను సినిమాతో ఎంట్రీ ఇచ్చింది కియారా అద్వాని. మొదటి సినిమాతోనే స్టార్ హీరోయిన్ అనిపించుకుంది. అంతే ఇక వెంటనే మెగా పవర్ స్టార్ రాం
చరణ్ సినిమా వినయ విధేయ రామా సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. అయితే ఆ
సినిమా ఘోరమైన పరాజయం కావడంతో కియారాకి ఇంకో ఛాన్స్ రాలేదు. సరిగ్గా అదే సమయంలో తెలుగు
అర్జున్ రెడ్డి హింది రీమేక్ అయిన
కబీర్ సింగ్ కియారాకి
బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ ని ఇచ్చింది. దీంతో
బాలీవుడ్ నుండి
టాలీవుడ్ కి చూడటానికి కూడా సమయం దొరకడం లేదట. అంతేకాదు తెలుగు నుండి కియారాకుకు చాలా ఆఫర్స్ వస్తున్నప్పటికి ఏదీ ఒప్పుకోవడంలేదని తెలుస్తోంది.
హిందీ సినిమాలకే ఇంపార్టెన్స్ ఇస్తుందని అర్థమవుతోంది. ప్రస్తుతం బాలీవుడ్లో క్షణం ఖాళీ లేకుండా బిజీగా గడుపుతున్న కియారా వరుసగా హిందీలో ఐదు భారీ సినిమాల్లో నటించేస్తోంది.
లక్ష్మీ బాంబ్- గుడ్ న్యూస్- ఇందూకి జవానీ- షేర్ షా-భూల్ బులయా 2 సినిమాలతో ఇప్పుడు ఫుల్ బిజీగా ఉంది అద్వానీ.
అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్న 'లక్ష్మీ బాంబ్' సినిమాకి
లారెన్స్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో
ఆమె రాయ్
లక్ష్మీ పోషించిన పాత్రను పోషిస్తోంది. అలానే
కరణ్ జోహార్ నిర్మిస్తున్న 'గుడ్ న్యూస్' లోనూ
అక్షయ్ - దిల్జీత్ లాంటి స్టార్లతో కలిసి నటిస్తోంది.
విష్ణు వర్ధన్ దర్శకత్వం 'షేర్ షాలో'నూ కియరా కీలక పాత్ర పోషిస్తోంది. అలానే యంగ్ హీరో
కార్తీక్ ఆర్యన్ సరసన 'భూల్ బులయా' సీక్వెల్ 'భూల్ బులయా 2'లో నటిస్తుంది. ఈ సినిమాని హారర్
కామెడీ బ్యాగ్డ్రాప్ లో తెరకెక్కిస్తున్నారు.
ఆదిత్య సీల్ అనే యంగ్ హీరో సరసన ఇందూకి జవానీ సినిమాలోను ఆడిపాడుతోంది. ఇలా వరస సినిమాలతో ఫుల్ బిజీ అయిన కియారా అక్కడ ఖాళీగా ఉంటే అప్పుడు
టాలీవుడ్ సినిమాల గురించి ఆలోచిద్దాం అంటోందట. మరి రెమ్యూనరేషన్ పరంగా తెలుగు వైపు చూడటం లేదా లేక
బాలీవుడ్ అంటే ఇష్టమా అన్నది మాత్రం క్లారిటిగా తెలీడం లేదు.