తెలుగు లో వస్తున్న బిగ్ బాస్ సీజన్ 3కి ఎండ్ కార్డ్ పడేందుకు మరో వారం రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ వారం ఇంటి నుండి ఒకరు బయటకి వెళ్లనుండగా, నిన్నటి నామినేషన్ లో నామినేషన్లో శివజ్యోతి, అలీ రెజా మాత్రమే మిగిలారు. మిగిలిన రాహుల్, బాబా భాస్కర్,వరుణ్ సందేశ్, శ్రీముఖి సేఫ్ జోన్ లోకి వెళ్లారు. ఇప్పటికే రాహుల్ టిక్కెట్ టూ ఫినాలేకి వెళ్ళగా, గత రాత్రి బాబా భాస్కర్ టిక్కెట్ టూ ఫినాలే ఛాన్స్ దక్కించుకున్నారని బిగ్ బాస్ తెలిపారు .
అయితే ప్రతి ఆదివారం ఎలిమినేషన్ ప్రక్రియ జరుగుతూ వస్తుండగా, ఈ ఆదివారం దీపావళి కావడంతో నేడు ఎలిమినేషన్ ప్రక్రియ ఉంటుందని చెబుతున్నారు. ఈ వారం ఇంట్లొకి విజయ్ దేవరకొండ వచ్చి అందరిని సీక్రేట్స్ చెప్పమఅన్నారు. ఒక్కొక్కరూ తమ గ్రపూ తగాదాలు బయట పెట్టుకున్నారు. అందుకు కారణం బయట పరిస్థితులు అన్నీ చూసి వచ్చి గేమ్ ఆడడం, గతంలో జోష్ ఇప్పుడు లేకపోవడం వలన అలీకి తక్కువ ఓట్స్ పడ్డాయని చెబుతున్నారు.
శ్రీముఖి అయితే ఏకంగా బాబా భాస్కర్ ని లేపాయాలి అని చెప్పింది. ఇదిలా ఉంటూ అందరూ ఊహించినట్లుగా అలీ రెజా వెళ్లిపోతాడని భావించారు..కానీ ట్విస్ట్ ఇస్తూ నాగార్జున శివజ్యోతి ఫోటో చూపించారు. దాంతో శివజ్యోతి మొఖం వాడిపోయింది. మరోసారి ట్యాప్ ఓపెన్ చేసింది. ఇక స్టేజ్ పై శివజ్యోతి కొట్టిన సెంటిమెంట్ డైలాగ్స్ తో ఇంటి సభ్యులు అందరూ కన్నీరు పెట్టుకున్నారు.