టాలీవుడ్ లో దాదాపు పదేళ్ల విరామం తర్వాత
మెగాస్టార్ చిరంజీవి, వివివినాయక్ దర్శకత్వంలో ‘ఖైదీ నెంబర్ 150’ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చారు. మొదట్లో రీ ఎంట్రీ విషయంపై రెండు సంవత్సరాలు తర్జనభర్జన చేసిన
మెగాస్టార్ తమిళంలో సూపర్ హిట్ అయిన
విజయ్ మూవీ ‘కత్తి’ తెలుగు నేటివిటీకి తగ్గట్టు ‘ఖైదీ నెంబర్ 150’ గా తెరకెక్కించారు. ఈ
మూవీ నిజంగా అనుకున్నదానికన్నా ఎక్కువ విజయం సాధించింది.
బ్రిటీష్ సైన్యాన్ని గడ గడలాడించిన మొట్టమొదటి తెలుగు స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి
జీవిత కథ ఆధారంగా ‘సైరా నరసింహారెడ్డి’ మూవీలో నటించారు చిరంజీవి. ఈ
మూవీ అక్టోబర్ 2
గాంధీ జయంతి సందర్భంగా రిలీజ్ చేశారు. తెలుగు,
కన్నడ, మళియాళ,
హిందీ భాషల్లో ఈ
మూవీ తెరకెక్కించిన విషయం తెలిసిందే. కాకపోతే ఊహంచినదానికన్నా అంత పెద్ద టాక్ తెచ్చుకోలేపోయింది..కాకపోతే ఒక తెలుగు వీరుడు
జీవిత కథ ‘సైరా’తో అందరికీ తెలిసేలా చేశామని చిత్ర యూనిట్ అంటున్నారు.
తాజాగా
మెగాస్టార్ చిరంజీవి స్టార్ డైరెక్టర్
కొరటాల శివ దర్శకత్వంలో 152 వ మూవీలో నటిస్తున్నారు. వచ్చేనెలలో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్టు తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లలోనే
కొరటాల బిజీగా వున్నాడు.ఈ
సినిమా తరువాత ఆయన
త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయనున్నట్టు సమాచారం. కొంత కాలంగా మెగా హీరోలకు వరుస విజయాలు అందిస్తున్నారు త్రివిక్రమ్.
ఈ నేపథ్యంలోనే ఆ మధ్య చిరంజీవికి
త్రివిక్రమ్ ఒక
కథ చెప్పడం .. అది చిరంజీవికి నచ్చేయడం జరిగిపోయాయట. ఆ
కథ పూర్తి స్క్రిప్ట్ ను కూడా ఇటీవల
త్రివిక్రమ్ పూర్తి చేశాడట. ఆ స్క్రిప్ట్ ను చిరంజీవికి వినిపించనున్నాడనీ,
చిరంజీవి నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే,
కొరటాల మూవీ తరువాత ఆయన చేయనున్న
సినిమా ఇదే అవుతుందని అంటున్నారు.