తెలుగు బిగ్ బాస్ సీజన్ 3 రియాల్టీ షో త్వరలో చివరిదశకు చేరుకోనుంది. శివ జ్యోతి ఎలిమినేట్ కావడంతో టాప్ 5కి చేరిపోయారు శ్రీముఖి, బాబా భాస్కర్, అలీ రెజా, వరుణ్ సందేశ్ మరియు రాహుల్. ప్రస్తుతం సీజన్ 3 టైటిల్ విన్నర్ ఎవరు గెలుస్తారు అన్న దాని విషయంలో చూస్తున్న వీక్షకులకు సోషల్ మీడియాలో నెటిజన్లకు చాలా టెన్షన్ నెలకొని ఉంది. ఇటువంటి క్రమంలో బిగ్ బాస్ ఇంట్లో ఉన్న సభ్యులపై మరియు బిగ్ బాస్ మేనేజ్మెంట్ పై షాకింగ్ కామెంట్ చేసింది బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయిన సీనియర్ నటి హేమ. ముఖ్యంగా శ్రీముఖి ని టార్గెట్ చేసుకుని హేమ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.


ఇటీవల నటి హేమ మాట్లాడుతూ బిగ్ బాస్ హౌస్ లో తనకు అవమానం జరిగిందని తాను ఎలిమినేట్ అయిన సందర్భంలో ఏవీ కూడా పూర్తిగా చూపించకుండా పంపిణీ చేశారని హేమ తెలిపింది. అంతేకాకుండా యాంకర్ శ్రీముఖి వేస్తున్న వ్యూహాల వల్ల హౌస్ లో ఉన్న సభ్యులు బలవుతున్నారని హేమ ఆరోపిస్తోంది. బిగ్ బాస్ ప్రారంభం కాక ముందు శ్రీముఖి బర్త్ డే సెలెబ్రేషన్స్ జరిగాయి. ఆ సెలెబ్రేషన్స్ కు రాహుల్ కూడా హాజరయ్యాడు.


కానీ నేను మాత్రం హాజరు కాలేదు. నేను వారందరికీ ప్రధాని పోటీ అని నాపై ఆ బర్త్ డే సెలెబ్రేషన్స్ లోనే కుట్ర పన్నారు. ఎవరెప్పుడు ఎలిమినేట్ కావాలనే విషయాన్ని కూడా అక్కడే డిసైడ్ చేసారని హేమ ఆరోపించింది.మొట్ట మొదటి వారం లోనే ఇంటి నుండి ఎలిమినేట్ కావడం ప్లానింగ్ తోనే జరిగిందని ఆరోపించింది. బిగ్ బాస్ ఫైనల్స్ కు హాజరు కావాలని ఆహ్వానం పంపారు. కానీ మరోమారు వెళ్లి అవమానపడడం నావల్ల కాదు. అందుకే ఫైనల్స్ కు నేను వేళ్లను అని హేమ తేల్చేసింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: