టాలీవుడ్ డార్లింగ్ హీరో ప్రభాస్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే మొన్నటి వరకూ టాలీవుడ్ కి మాత్రమే ప్రభాస్ క్రేజ్... బాహుబలి ఇంటర్నేషనల్ హిట్ తర్వాత ప్రపంచం నలుమూలల పాకింది . ఇప్పుడు ప్రభాస్ సినిమా వస్తుందంటే చాలు పొరుగు దేశాల అభిమానులు సైతం వేచి చూస్తుంటారు. అయితే బాహుబలి లాంటి సెన్సేషనల్ హిట్  తర్వాత... సాహో మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ప్రభాస్ . అయితే భారీ బడ్జెట్ సినిమాగా రూపొందిన సాహో సినిమాపై ... ప్రేక్షకుల్లో  భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ  మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన సాహో సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక పోయింది. 

 

 

 

 ప్రేక్షకులు అంచనాలను అందుకోలేక బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది సాహో సినిమా. అయితే కలెక్షన్ల పరంగా బాగానే వసూలు చేసినప్పటికీ  టాక్ పరంగా మాత్రం సాహో కి గట్టి దెబ్బే తగిలింది. ఈ నేపథ్యంలో సాహో సినిమా ఫలితం ప్రభాస్ ను  ఆలోచనలో పడేసినట్లు కనిపిస్తోంది. అందుకే కథల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు  రెబల్ స్టార్ ప్రభాస్. కథకి భారీ బడ్జెట్ బలాన్ని చేకూర్చదు  లేదనే విషయం ప్రభాస్ కి అర్థం అయినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన నెక్స్ట్ సినిమా విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు ప్రభాస్. 

 

 

 

 జిల్  ఫెమ్ krishna KUMAR' target='_blank' title='రాధా కృష్ణ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రాధా కృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ నెక్స్ట్ మూవీ రాబోతుంది. అయితే ఈ సినిమా కథపై  మరోసారి ప్రభాస్ దర్శకుడు krishna KUMAR' target='_blank' title='రాధాకృష్ణ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రాధాకృష్ణ చర్చించినట్లు సమాచారం. బడ్జెట్ ను  కూడా దృష్టిలో పెట్టుకుని కొన్ని మార్పులను సూచించాడట ప్రభాస్. కథా కథనాల పరంగా ప్రభాస్ చేసిన సూచనలకు తగ్గట్టుగానే మార్పులు  కూడా చేశారట దర్శకులు . కాగా ఈ సినిమా వచ్చే నెలలో పట్టాలు ఎక్కడానికి సన్నాహాలను మొదలుపెట్టినట్లు సమాచారం. అయితే కథలో మార్పులు చేయకముందు యూరప్ లో ఇరవై రోజుల పాటు ఈ సినిమా చిత్రీకరణ జరిగింది. ప్రస్తుతం కథలో మార్పులు చేశారు కాబట్టి ఆ సన్నివేశాలను అలాగే ఉంచుతారా లేకపోతే తీస్తారా చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: