గత ఏడాది ప్రారంభంలో  భాగమతి సినిమా తో ప్రేక్షకులముందుకు వచ్చి సూపర్ హిట్ కొట్టింది సౌత్   స్టార్ హీరోయిన్ అనుష్క.  అశోక్  దర్శకత్వంలో  లేడీ ఓరియెంటెడ్ గా తెరకెక్కిన ఈ చిత్రందాదాపు 50కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. లీడింగ్ ప్రొడక్షన్  హౌస్ యువీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ చిత్రం  తరువాత  చాలా గ్యాప్ తీసుకున్న అనుష్క ఇటీవలే  'నిశ్శబ్దం' అనే  చిత్రాన్ని పూర్తి చేసింది.  ప్రస్తుతం  పోస్ట్ ప్రొడక్షన్  దశలో వున్న ఈ చిత్రం వచ్చే ఏడాది  విడుదలకానుంది.   నిన్న దీపావళి కానుకగా  విడుదలైన ఈ చిత్రం యొక్క ప్రీ టీజర్ సినిమాపై ఆసక్తిని తీసుకొచ్చింది. ఇక ఈ సినిమా టీజర్  నవంబర్ 7న విడుదలకానుంది.



హేమంత్ మధుకర్ తెరకెక్కిస్తున్న ఈ సస్పెన్స్ థ్రిల్లర్ లో  తమిళ నటుడు మాధవన్ కీలక పాత్రలో నటిస్తుండగా   ప్రముఖ నటుడు సుబ్బరాజు,   హీరోయిన్  అంజలి , అర్జున్ రెడ్డి ఫేమ్ షాలిని పాండే తో పాటు ప్రముఖ  హాలీవుడ్ నటుడు  మైఖేల్ మాడిసన్  ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.  ఈ సినిమా షూటింగ్  అంత  యూఎస్ లోని సియాటెల్ లోనే జరిగింది.    మలయాళ సంగీత  దర్శకుడు  గోపి సుందర్  సంగీతం అందిస్తుండగా   కోన ఫిలిం కార్పొరేషన్ ,పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ల పై  కోన వెంకట్ , టీజీ విశ్వప్రసాద్  ఈచిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు , తమిళహిందీ తో  పాటు ఇంగ్లీష్  లోనూ విడుదలచేయనున్నారు.  




ఇక ఈచిత్రం తరువాత  అనుష్క ఇప్పటివరకు తెలుగులో  మరో సినిమాకు సైన్ చేయలేదు. అయితే కోలీవుడ్ లో లెజండరీ డైరెక్టర్  మణిరత్నం భారీ బడ్జెట్ తో  తెరకెక్కించినున్నపొన్నియన్ సెల్వన్ లో  అనుష్క  ఓ కీలక పాత్రలో నటించనున్నట్లు  తెలుస్తుంది. త్వరలోనే దీని గురించి ఓ క్లారిటీ రానుంది.   


మరింత సమాచారం తెలుసుకోండి: