బయ్యర్లు రాజ్ తరుణ్ పై నమ్మకం కోల్పోయారా?  వరుస ఫ్లాప్స్ ఎఫెక్ట్ రాజ్ తరుణ్ పై గట్టిగానే పడింది. హిట్ కొడితే తప్పా.. ఈ యంగ్ హీరో కోలుకునేలా లేడు. రాజ్ తరుణ్, ఆశలన్నీ స్టార్ ప్రొడ్యూసర్ మీదే పెట్టుకున్నాడు. ఆ బడా నిర్మాతనే ఈ యంగ్ హీరోని గట్టెక్కించాలనే టాక్ వినిపిస్తోంది. 


న్యూ జనరేషన్ యువ హీరోల్లో రాజ్ తరుణ్ మంచి గుర్తింపే తెచ్చుకున్నాడు. మొదట్లో వరుస హిట్ లతో సత్తా చాటిన రాజ్ తరుణ్ తర్వాత బాగా వెనుకబడ్డాడు. కంటిన్యూ ఫ్లాపులతో దాదాపు ఫేడ్ అవుట్ అయ్యాడేమో అనే స్టేజ్ కు ఈ యంగ్ హీరో ఐదేళ్లుగా సక్సెస్ లేకపోవడంతో బయ్యర్లు సైతం ఈ యంగ్ హీరోపై నమ్మకం కోల్పోయినట్టు కనిపిస్తోంది. సక్సెస్ కొడితే తప్పా కెరీర్ గాడిలో పడేలా లేదు. ఇలాంటి టైంలో రాజ్ తరుణ్ ఆశలన్నీ దిల్ రాజు మీదే పెట్టుకున్నట్టు తెలుస్తోంది. 


వరుస ఫ్లాప్స్ తర్వాత చిన్న గ్యాప్ తీసుకున్న రాజ్ తరుణ్ ఇద్దరి లోకం ఒకటే సినిమాతో రాబోతున్నాడు. జీఆర్ కృష్ణ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో షాలిని పాండే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మధ్యే ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్లు.. లిరికల్ సాంగ్స్ రిలీజ్ చేస్తూ సిినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నారు. అయితే బయ్యర్లు మాత్రం రాజ్ తరుణ్ ట్రాక్ రికార్డ్ ని నమ్మడం లేదట. కేవలం దిల్ రాజునే నమ్ముతున్నట్టు తెలుస్తోంది. 


కేవలం దిల్ రాజు మీదున్న నమ్మకంతోనే బయ్యర్లు ఇద్దరిలోకం ఒక్కటే సినిమాను కొనడానికి ధైర్యం చేస్తున్నారట. రాజ్ తరుణ్ సైతం దిల్ రాజు మ్యాజిక్ నే నమ్ముకున్నట్టు సమాచారం. ఈ స్టార్ ప్రొడ్యూసర్ హిట్ ఇచ్చి ఆదుకుంటాడని రాజ్ తరుణ్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడట. దిల్ రాజు సైతం సినిమా కంటెంట్ పై మంచి నమ్మకంతో ఉన్నట్టు సమాచారం. అయితే ప్రస్తుతం చిన్న సినిమాల రిజల్ట్స్ తేడా కొడుతున్నాయి. కానీ దిల్ రాజు మ్యాజిక్ వర్కవుట్ అయి ఇద్దరి లోకం ఒక్కటే హిట్ అయితేనే రాజ్ తరుణ్ సేఫ్... లేకపోతే ప్రమాదంలో పడినట్టే..!

మరింత సమాచారం తెలుసుకోండి: