టాలీవుడ్
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ సెన్సేషనల్
మూవీ సరిలేరు నీకెవ్వరు.
మహేష్ బాబు, దిల్ రాజు,
అనిల్ సుంకర కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో
మహేష్ బాబు, మేజర్
అజయ్ కృష్ణ అనే పాత్రలో నటిస్తుండగా
రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను వచ్చే ఏడాది
సంక్రాంతి కానుకగా
జనవరి 12న రిలీజ్ చేయబోతున్న విషయం తెలిసిందే. లేడీ
అమితాబ్ గా పేరుగాంచిన
విజయశాంతి గారు, ప్రొఫెసర్
భారతి అనే పాత్రలో నటిస్తున్న ఈ సినిమాపై
టాలీవుడ్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.
సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులు సైతం కోరుకునే అన్ని అంశాలను జోడించి దర్శకుడు
అనిల్ రావిపూడి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.
ఇకపోతే ఈ
సినిమా ప్రీ రిలీజ్
బిజినెస్ లో దుమ్మురేపుతున్నట్లు నేడు
టాలీవుడ్ వర్గాల నుండి వార్తలు వెలువడుతున్నాయి. ఇప్పటికే ఈ
సినిమా ఓవర్సీస్ హక్కులను దక్కించుకున్న గ్రేట్
ఇండియా ఫిలింస్ వారు అత్యధిక ధర ఇచ్చి సినిమాను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇక మరోవైపు ఆంధ్ర మరియు తెలంగాణలోని ముఖ్య ప్రాంతాల హక్కులకు భారీ స్థాయిలో పోటీ నెలకొని ఉన్నట్లు తెలుస్తోంది. నైజాం హక్కుల కోసం ఇప్పటికే ఒక బడా
ప్రొడ్యూసర్ భారీ ధర చెల్లించడానికి సిద్ధం అయ్యారని, అలానే ఆంధ్ర లోని పలు ముఖ్య ప్రాంతాల హక్కులు కూడా ఆయనే దక్కించుకోబుతున్నట్లు తెలుస్తోంది.
ఇక మిగిలిన
కర్ణాటక మరియు
తమిళ నాడు హక్కుల కోసం కూడా పలువురు బయ్యర్లు బాగానే ధరలు ఇవ్వడానికి సిద్ధం అవుతున్నారని, దీనినిబట్టి చూస్తుంటే, ఈ సరిలేరు నీకెవ్వరు
సినిమా ఓవర్ ఆల్ గా
మహేష్ బాబు కెరీర్ లోనే అత్యధిక స్థాయిలో
బిజినెస్ చేసే సినిమాగా నిలిచే అవకాశం కనపడుతోందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. అయితే ఈ
సినిమా ఓవర్ ఆల్ గా ఎంత మేర
బిజినెస్ చేయబోతోంది అనే దానిపై అధికారిక ప్రకటన మాత్రం వెలువడాల్సి ఉంది. మరి సంక్రాంతికి రాబోయే ఈ
సినిమా ఎంత మేర సక్సెస్ అవుతుందో చూడాలి....!!